News January 8, 2025

HYD: 2024లో జైళ్లకు 41,138 మంది ఖైదీలు: డీజీ

image

2024లో వివిధ కేసుల్లో జైలుకు వచ్చిన వారి సంఖ్య భారీగా పెరిగిందని, ఈ ఏడాదిలో 41,138 మంది జైలుకు వచ్చారని ఆ శాఖ డీజీ సౌమ్య మిశ్రా వెల్లడించారు. HYDలో సౌమ్య మిశ్రా జైళ్ల వార్షిక నివేదికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. 2024లో హత్యకేసుల్లో 2,754 మంది శిక్ష అనుభవిస్తున్నట్లు తెలిపారు. 2024లో పోక్సో కేసుల్లో 3,655 మంది పురుషులు, 94 మంది మహిళలు జైళ్లలో ఉన్నట్లు చెప్పారు.

Similar News

News October 16, 2025

HYD: చేతుల మీదే భారం.. సిటీలో ప్రయాణం!

image

సిటీ శివారులోని స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులను ఆర్టీసీ బస్సుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పీక్స్ అవర్‌లో సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి ఉంది. దిల్‌సుఖ్‌నగర్ నుంచి ఇబ్రహీంపట్నం, ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీనగర్, ఉప్పల్ రూట్‌లో ఉదయం, సాయంత్రం కూర్చోడానికి కనీసం సీటు దొరకనంత రద్దీ ఉంటోంది. విద్యార్థులు ఫుట్ బోర్డ్‌పై వేలాడుతూ ఇలా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు.

News October 15, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: INCకి వ్యతిరేకంగా 1500 నామినేషన్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఊహించని పరిస్థితులు నెలకొన్నాయి. ఉప ఎన్నికలో INCకి వ్యతిరేకంగా 1500 మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు. 1000 మంది నిరుద్యోగులు, 300 మంది RRR భూ బాధితులు, 200 మంది మాల కులస్థులు నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్‌ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిస్తేనే అధికార అహంకారం తగ్గుతుందని, అప్పుడే చిత్తశుద్ధితో పని చేస్తారని పోటీదారులు పేర్కొంటున్నారు.

News October 15, 2025

HYD: స్వీట్ షాపుల్లో తనిఖీలు

image

GHMC ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ మూర్తి రాజ్ ఆధ్వర్యంలో గ్రేటర్‌లోని పలు స్వీట్ షాపుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దీపావళి పండుగ నేపథ్యంలో ఈ రైడ్స్ నిర్వహించినట్లు తెలిపారు. కనీస రూల్స్ పాటించని వ్యాపారుల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని షాప్‌లకు నోటీసులు జారీ చేశారు. శాంపిల్స్ సేకరించి ల్యాబ్‌కు పంపించామని మూర్తి రాజ్ వెల్లడించారు. సిటీలోని మొత్తం 43 స్వీట్ షాపుల్లో ఈ తనికీలు కొనసాగాయి.