News February 23, 2025
HYD: 2030 నాటికి 1.27 కోట్ల జనాభా..!

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD నగర విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.
Similar News
News December 15, 2025
లేటెస్ట్ సినిమా అప్డేట్స్

⋆ అనుదీప్ దర్శకత్వంలో విశ్వక్సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న ‘ఫంకీ’ సినిమా 2026, ఫిబ్రవరి 13న విడుదల
⋆ అడివి శేష్, మృణాల్ ఠాకూర్ నటిస్తున్న ‘డెకాయిట్’ సినిమా టీజర్ను ఈ నెల 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ టీమ్
⋆ విఘ్నేశ్ శివన్ డైరెక్షన్లో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ విడుదల వాయిదా.. ఈ నెల 18న రిలీజ్ కావాల్సి ఉండగా పోస్ట్పోన్ చేసిన టీమ్
News December 15, 2025
లీగల్ ఎయిడ్ క్లినిక్ల ద్వారా న్యాయ సలహాలు: జడ్జి సంతోష్

లీగల్ ఎయిడ్ క్లినిక్ ద్వారా న్యాయ సలహాలు అందించడంతో పాటు, ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తామని సిద్దిపేట జిల్లా లీగల్ సెల్ అథారిటీ సెక్రటరీ, జడ్జి సంతోష్ కుమార్ తెలిపారు. సోమవారం సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్లినిక్ను ప్రారంభించి ఆయన మాట్లాడారు. ప్రతి క్లినిక్లో ఒక అడ్వకేట్ తో పాటు పారా లీగల్ వాలంటీర్ అందుబాటులో ఉంటారని వివరించారు.
News December 15, 2025
బాపట్ల కలెక్టరేట్కు 173 అర్జీలు

బాపట్ల కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కారం వేదికకు 173 అర్జీలు వచ్చినట్లు కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల వద్ద ఆయన నేరుగా అర్జీలను సేకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నమోదైన ప్రతి అర్జీని పోర్టల్లో నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు.


