News February 23, 2025
HYD: 2030 నాటికి 1.27 కోట్ల జనాభా..!

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD నగర విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.
Similar News
News November 6, 2025
హైటెక్స్లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2025

HYDలో నవంబర్ 25- 28 వరకు దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా ఎక్స్పో జరగనుంది. వన్ నేషన్ వన్ EXPO థీమ్తో జరిగే ఈవెంట్లో 50 దేశాల నుంచి 500 ఎగ్జిబిటర్స్, 40,000 కుపైగా సందర్శకులు పాల్గొంటారు. 35,000 చదరపు మీటర్లలో తాజా పౌల్ట్రీ సాంకేతికతలు, సస్టైనబుల్ సొల్యూషన్స్ ప్రదర్శించబడతాయి. దేశ పౌల్ట్రీ రంగం రూ.1.35 లక్షల కోట్లతో ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.
News November 6, 2025
HYD: గోపి నా పెద్దకొడుకని అక్షరను హత్తుకున్న అవ్వ

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు రహమాత్నగర్లోని ఫాతిమా నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో ఓ అవ్వ ‘గోపీ నా పెద్ద కొడుకు అని గుర్తు తలుచుకుంటూ.. నా మనుమరాలు అని ఆప్యాయంగా అక్షరను దగ్గరకు తీసుకొని మనస్ఫూర్తిగా దీవించారు. మాగంటి సునీత అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గంటెపాక నరేష్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.
News November 6, 2025
HYD: 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదు: సీఎం

బీఆర్ఎస్ సహకరించకపోతే మోదీ ప్రధాని అయ్యేవారు కాదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ పేరుతో జూబ్లీహిల్స్లో ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరితే KCRకు 24 గంటల్లో చిప్పకూడు తినిపిస్తానన్న MP కిషన్ రెడ్డి, విచారణకు ఆదేశించి 3 నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్ 30 వేల మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు.


