News February 27, 2025
HYD: 2030 నాటికి 1.27 కోట్ల జనాభా..!

జీహెచ్ఎంసీ పరిధిలో జనాభా వేగంగా పెరుగుతోంది. వివిధ సర్వేల ప్రకారం, ప్రస్తుతం 1.08 కోట్లు ఉన్న జనాభా 2030 నాటికి 1.27 కోట్లకు చేరుతుందని అంచనా. ఈ పెరుగుదల దృష్ట్యా రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ట్రాన్స్పోర్ట్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. HYD విస్తరణతో పాటు సమతుల్య ప్రణాళికలు అవసరమని అభిప్రాయపడ్డారు.
Similar News
News November 22, 2025
కామారెడ్డి: టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు పరీక్షలకు దరఖాస్తులు

టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు ఎగ్జామినేషన్లో డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు DEO రాజు తెలిపారు. డ్రాయింగ్ లోయర్ గ్రేడ్లో పరీక్ష ఫీజు ₹100, హయ్యర్ గ్రేడ్ పరీక్ష ఫీజు ₹150, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్లో ₹150, హయ్యర్ గ్రేడ్లో ₹200 చెల్లించాలని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసిన సర్టిఫికెట్లు DEC 20లోపు DEO ఆఫీసులో సమర్పించాలని పేర్కొన్నారు.
News November 22, 2025
సత్యసాయి బాబా శత జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించండి: కలెక్టర్

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతోత్సవాలను జిల్లా వ్యాప్తంగా వైభవంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేయాలని అధికారులను కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. ఈ ఏడాది సత్యసాయి బాబా శత జయంతి సందర్భంగా ప్రతీ మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కలెక్టర్ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
News November 22, 2025
షూటింగ్లో గాయపడిన హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్లో శ్రద్ధా నటిస్తున్నారు.


