News December 26, 2024

HYD: 2030 నాటికి 20 వేల మెగావాట్ల ఇంధన ఉత్పత్తి: భట్టి

image

2030 నాటికి స్వచ్ఛమైన, స్థిరమైన 20 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి, జాతీయ స్థాయిలో పెట్టుకున్న లక్ష్యాన్ని అందుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ విధానాన్ని ప్రతిపాదించిందన్నారు.

Similar News

News December 22, 2025

RR: నేడు సర్పంచ్ సాబ్, మేడమ్ వస్తున్నారు!

image

సర్పంచ్‌లు, వార్డు సభ్యులు నేడు వారి వారి గ్రామపంచాయతీల్లో ప్రమాణం చేయనున్నారు. రంగారెడ్డి జిల్లాలో 3 విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 526 GPలకు 525 గ్రామాల్లో కొత్త పాలకవర్గాలను ఎన్నుకున్నారు. నేడు వారితో పంచాయతీ సెక్రటరీలు ప్రమాణం చేయిస్తారు. కాగా జిల్లాలో మాడ్గుల మండలంలోని నర్సంపల్లి GPకి ఎన్నిక జరగలేదు. ప్రమాణ స్వీకారంపై జిల్లాలోని MPDOలు ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.

News December 22, 2025

అజ్మీర్ దర్గా ఉర్సుకు కేసీఆర్ చాదర్ సమర్పణ

image

అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది పార్టీ తరఫున చాదర్ సమర్పించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ సంవత్సరం కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాదర్ సమర్పించారు. కార్యక్రమంలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీతో పాటు పార్టీ మైనారిటీ విభాగానికి చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. అజ్మీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు.

News December 21, 2025

HYD: రేపు నాట్కో పరిశ్రమలో ‘మాక్ ఎక్సర్‌సైజ్’

image

ప్రకృతి విపత్తులు, అగ్ని ప్రమాదాల వేళ అనుసరించాల్సిన రక్షణ చర్యలపై అవగాహన కల్పించేందుకు ఈనెల 22న మేకగూడలోని నాట్కో పరిశ్రమ ఆవరణలో ‘మాక్ ఎక్సర్‌సైజ్’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రమాద సమయాల్లో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించేందుకు ముందస్తు సన్నద్ధత అవసరమని, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే అంశంపై సిబ్బందికి, అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.