News November 28, 2024
HYD: 26 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య

వచ్చే డీఎస్సీలో 26 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దిల్సుఖ్నగర్లో జరిగిన నిరుద్యోగుల సభలో మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. ఏ పాఠశాలకు వెళ్లినా టీచర్ల కొరత ఉందన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో 6 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వటం లేదన్నారు.
Similar News
News October 27, 2025
జూబ్లీహిల్స్ నుంచే BRS శవయాత్ర: కాంగ్రెస్

జూబ్లీహిల్స్ నుంచే BRS జైత్రయాత్ర అంటోన్న KTRకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ‘జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ శవయాత్ర మొదలైతది కేటీఆర్. ఏ ఇంటికి పోయినా పదేండ్లలో మీరు ఎగ్గొట్టిన హామీలే గుర్తుకొస్తాయి. మీ ముఖాలు చూసి ఇంకా ఎవరైనా ఓటు వేస్తారా?. జూబ్లీహిల్స్లోనే మీకు సమాధి. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ దాకా మీ పార్టీ ఉంటదా?’ అంటూ INCTelangana అధికారిక అకౌంట్లో ట్వీట్ చేసింది. దీనిపై మీ కామెంట్?
News October 26, 2025
చంచల్గూడ జైలుకు 150 ఏళ్ల చరిత్ర

చంచల్గూడ జైలు 1876లో నిర్మించబడింది. ఈ జైలుకు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. నిజాం కాలంలో పాలనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని నేరస్తులుగా ముద్ర వేసి క్రమశిక్షణ పేరుతో అణచివేయడం జరిగేది. నవాబులు తమకు విరోధంగా ఉన్నవారిని ఇక్కడ నిర్బంధించేవారు. అప్పట్లో 70 ఎకరాల్లో విస్తరించిన ఈ జైలు కాలక్రమంలో సంస్కరణలు, నగర విస్తరణ కారణంగా ప్రస్తుతం సుమారు 30 ఎకరాలకు మాత్రమే పరిమితమైంది.
News October 26, 2025
HMDA పునర్వ్యవస్థీకరణ..జోనింగ్ పై FOCUS

HYD మహానగర అభివృద్ధి సంస్థ HMDA పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. నగర పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి కొత్త ప్రణాళికలు రూపొందిస్తున్న అధికారులు RRR వరకు విస్తరించిన పరిధిలో ఘట్కేసర్, శంషాబాద్, శంకరపల్లి 1-2, మేడ్చల్ 1-2 జోన్లను విభజించి, ప్రతి జోన్లో ప్రత్యేక అధికారులు, సాంకేతిక సిబ్బందిని నియమించే అవకాశముంది. ముఖ్యంగా జోనింగ్ పై ఫోకస్ పెట్టింది


