News February 15, 2025

HYD: 3 లైన్లలో నడిచేవి 57 మెట్రో రైళ్లు..!

image

నగరంలో ప్రస్తుతం 57 మెట్రో రైళ్లు 3 లైన్లలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గణనీయంగా పెరుగుతున్న ప్రయాణికులకు రైళ్లు సరిపోకపోవడంతో నిత్యం మెట్రోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. దీనికి ఇందుకు అదనంగా మరో 10 రైళ్లను తీసుకురావాల్సిన అవసరం ఉందని మెట్రో వర్గాలు అంచనా వేశాయి. ఈ మేరకు తగిన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సేవలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామన్నారు.

Similar News

News January 3, 2026

HNK: లారీ ఢీకొని గీత కార్మికుడి దుర్మరణం

image

ములుగు రోడ్డులోని కొత్తపేట ఎన్‌ఎస్‌ఆర్‌ ఆసుపత్రి వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరెపల్లికి చెందిన గీత కార్మికుడు గౌని అనిల్‌కుమార్ గౌడ్(48) మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఆయన్ను వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఆరెపల్లి రింగ్‌ రోడ్డు వద్ద సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్లే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News January 3, 2026

KCR ఎందుకలా చేశారో సభకు వస్తే అడుగుదామనుకున్నా: రేవంత్

image

TG: కృష్ణా ప్రాజెక్టులపై రాష్ట్రానికి కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ఆయన ఎందుకలా చేశారో సభకు వస్తే అడుగుదామనుకున్నా. కేసీఆర్ ఉద్దేశపూర్వకంగా చేశారా? ఎవరైనా తప్పుదోవ పట్టించారా?’ అని ప్రశ్నించారు. ఇక కర్ణాటక నుంచీ జలవివాదాలను పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయితీలు ఉన్నప్పటికీ కర్ణాటకపై కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

News January 3, 2026

GNT: మారిషస్ అధ్యక్షుడికి స్వాగతం పలికిన కలెక్టర్, ఎస్పీ

image

మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్‌కి గుంటూరులో ఘన స్వాగతం లభించింది. సతీ సమేతంగా విచ్చేసిన ఆయనను గుంటూరు వెల్కమ్ హోటల్ వద్ద కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ వకుల్ జిందాల్ ఘనంగా స్వాగతం పలికారు. 4వ తేదీ ఉదయం 10.30 ని.లకు బొమ్మిడాల నగర్ శ్రీ సత్య సాయి స్పిరిట్యుయల్ ట్రస్ట్‌లో ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్న మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొంటారు.