News February 15, 2025

HYD: 3 లైన్లలో నడిచేవి 57 మెట్రో రైళ్లు..!

image

నగరంలో ప్రస్తుతం 57 మెట్రో రైళ్లు 3 లైన్లలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాయి. గణనీయంగా పెరుగుతున్న ప్రయాణికులకు రైళ్లు సరిపోకపోవడంతో నిత్యం మెట్రోలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. దీనికి ఇందుకు అదనంగా మరో 10 రైళ్లను తీసుకురావాల్సిన అవసరం ఉందని మెట్రో వర్గాలు అంచనా వేశాయి. ఈ మేరకు తగిన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సేవలను మరింత మెరుగుపరచడానికి కృషి చేస్తున్నామన్నారు.

Similar News

News December 23, 2025

ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ ఆర్డర్

image

స్విగ్గీలో ఈ ఏడాది మోస్ట్ ఆర్డర్డ్ ఐటమ్‌గా బిర్యానీ నిలిచింది. వరుసగా 10th ఇయర్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. భోజన ప్రియులు ఈ ఏడాది 93 మిలియన్ బిర్యానీలు స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ ఆర్డర్ వచ్చినట్లు స్విగ్గీ తన ఇయర్ ఎండ్ రిపోర్టులో పేర్కొంది. కాగా మోస్ట్ ఆర్డర్డ్ లిస్టులో బర్గర్స్ (44.2M), పిజ్జా (40.1M), వెజ్ దోశ (26.2M) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి.

News December 23, 2025

సిరిసిల్ల నుంచి గోవాకు ప్రత్యేక బస్సు సర్వీసులు

image

పర్యాటకుల సౌకర్యార్థం ఈనెల 29, 30 తేదీల్లో సిరిసిల్ల నుంచి గోవాకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు RTC DM ప్రకాష్‌రావు తెలిపారు. మురుడేశ్వర్, గోకర్ణ, గోవా సందర్శనకు 2 ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. పెద్దలకు రూ.4,000, పిల్లలకు రూ.2,800 చార్జీగా నిర్ణయించామని, ఈనెల 29న మ.12 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుంచి బస్సు బయలుదేరుతుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News December 23, 2025

విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

ఉపాధ్యాయులు, మండల విద్యాధికారులు విధుల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన విద్యాశాఖ రివ్యూ సమావేశంలో ఆయన మాట్లాడారు. ’10వ తరగతిలో ఉత్తమ ఫలితాల కోసం ఉపాధ్యాయులు కృషి చేయాలి. వెనుకబడిన జుక్కల్ మండలంపై ప్రత్యేక దృష్టి సారించి, యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. DEO రాజు పాల్గొన్నారు.