News August 10, 2024

HYD: 3 వేల మంది నిపుణులతో హైటెక్ సిటీలో హబ్

image

HYDలోని హైటెక్ సిటీలో అమింగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దాదాపుగా 3000 మంది నిపుణులతో దీన్ని ఏర్పాటు చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, డేటా సెన్స్, లైఫ్ సైన్సెస్ లాంటివి అనేక డిజిటల్ అంశాలపై బయోలాజికల్ సంస్థ సేవలు అందించనుంది. వరల్డ్ క్లాసు లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం అందుబాటులోకి రానున్నట్లు సీఎం తెలిపారు.

Similar News

News November 15, 2025

HYD: పదే పదే లీకేజీలతో.. నీటి సరఫరాలో అంతరాయం

image

HYD నగరానికి నీటి సరఫరా చేసే జలమండలి పైప్ లైన్లు పదే పదే లీకేజీ కావడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. 2,3 రోజులపాటు ప్రజల ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా జలమండలి తగిన చర్యలు తీసుకోవాలని నగరంలోని సరూర్‌నగర్, ఉప్పల్, నాంపల్లి, అత్తాపూర్ ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

News November 15, 2025

HYD: BRSకు BYE.. BYE: కాంగ్రెస్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపు నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ BRS టార్గెట్‌గా ట్వీట్ చేసింది. ‘మొన్న గ్రామాలు.. నేడు HYD సిటీ BRSకు బై.. బై చెప్పాయి.. గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుడ్ బై చెబుతున్నారు.. రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఇక కనుమరుగు అవుతుంది’ అంటూ పేర్కొంది. కాగా HYD ప్రజలు అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ వైపే ఉన్నారన్న దానికి ఈ గెలుపు నిదర్శనమని ఆ పార్టీ నేతలు అన్నారు.

News November 15, 2025

జూబ్లీహిల్స్ ఎన్నికలో అత్యల్ప ఓట్లు ఎవరికంటే..?

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీ చేశారు. 58 మంది అభ్యర్థుల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాథోడ్ రవీందర్ నాయక్‌కు అత్యల్పంగా 9 ఓట్లు మాత్రమే వచ్చాయి. తార్నాకకు చెందిన రాథోడ్ రవీందర్ నాయక్ ఎంఏ ఆంగ్లం పూర్తి చేశాడు. కాగా, ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.