News November 17, 2025

HYD: 3 ప్రమాదాలు.. 25 రోజులు..83 మంది

image

ఒక్కరు.. ఇద్దరు కాదు.. 83 మంది దర్మరణం పాలయ్యారు. కేవలం 25 రోజుల వ్యవధిలో బస్సు ప్రమాదాల రూపంలో 83 మంది నగర వాసులు, శివారు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలులో అక్టోబర్ 24న 19 మంది, నవంబర్ 4న చేవెళ్లలో 19 మంది, ఈరోజు తెల్లవారుజామున సౌదీలో 45 మంది దుర్మరణం చెందారు. ఈ మూడు ఘోర రోడ్డు ప్రమాదాలన్నీ బస్సు ప్రమాదాలే కావడం గమనార్హం.

Similar News

News November 17, 2025

హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

image

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్‌‌వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.

News November 17, 2025

హైదరాబాద్ బస్తీలకు కదిలే అంగన్వాడీలు!

image

కదిలే గ్రంథాలయం, మూవింగ్ ఫుడ్ కోర్ట్ విన్నాం కానీ.. కదిలే అంగన్ వాడీ కేంద్రం విన్నారా..? లేదు కదా..! త్వరలో చూస్తారు కూడా. నగరంలోని పలు బస్తీలు, కాలనీల్లో మూవింగ్ అంగన్‌‌వాడీ కేంద్రాల ద్వారా సేవలందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు 37 అధునాతన వాహనాలను కూడా సిద్ధం చేసిందని సమాచారం. అంగన్‌వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో పౌష్టికాహారం అందించడంతో పాటు ఆరోగ్య సలహాలు ఇస్తారు.

News November 17, 2025

గ్రేటర్ చెరువులకు హైడ్రా అండ.. త్వరలో బాధ్యతలు ?

image

మహానగరంలో పలు చెరువులు కబ్జా కావడంతో వాటిని పరిరక్షించేందుకు హైడ్రా నడుంబిగించింది. ఈ క్రమంలో చెరువుల బాధ్యతను మొత్తం హైడ్రాకు అప్పగించాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నట్లు సమాచారం. చెరువులను కాపాడటంతో పాటు అభివృద్ధి కూడా హైడ్రా చేతుల్లో పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. GHMCలో చెరువుల పరిరక్షణకు సిబ్బంది సమస్య ఉండటంతో ఈ ఆలోచన చేస్తున్నారు. త్వరలో ఇద్దరు కమిషనర్లు సమావేశం కానున్నట్లు తెలిసింది.