News April 18, 2024

HYD: 40 శాతం మందికే వాటర్‌ మీటర్లు!

image

HYD నగరంలో HMWSSB పరిధిలో దాదాపు 13.5 లక్షల మంది వినియోగదారులు ఉండగా కేవలం సుమారు 5 లక్షల వరకు, అంటే 40 శాతానికి తక్కువ మందికి మాత్రమే వాటర్ మీటర్లు ఉండడం గమనార్హం. HMWSSB రికార్డుల ప్రకారం మీటర్లు అంతంత మాత్రమే ఉండటంతో నల్లాలకు మోటర్లు పెట్టి నీటిని లాగేస్తున్నా తెలియని పరిస్థితి. నీటి ఎద్దడికి ఇదొక కారణంగా కనిపిస్తోంది. దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Similar News

News September 11, 2025

29వ తేదీలోగా అన్ని పీజీ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలు

image

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల ఇంటర్నల్ పరీక్షలను ఈ నెల 29వ తేదీలోగా నిర్వహించాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు అన్ని కళాశాలలకు ఆదేశాలు జారీ చేశారు. అన్ని పీజీ కోర్సుల 2, 4వ సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్ ప్రాక్టికల్ పరీక్షలను త్వరితగతిన నిర్వహించాలని సూచించారు. ఈ నెల 29వ తేదీలోగా మార్కుల జాబితాను వెబ్‌సైట్లో అప్లోడ్ చేయాలన్నారు.

News September 11, 2025

HYD: అటవీశాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయం: మంత్రి

image

విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అధికారుల త్యాగం చిరస్మరణీయమని మంత్రి కొండా సురేఖ అన్నారు. నెహ్రూ జులాజికల్ పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ డా.జితేందర్, పీసీసీఎఫ్ సువర్ణ, కలెక్టర్ హరిచందనలతో కలసి అమరులకు పూలతో శ్రద్ధాంజలి ఘటించారు.

News September 11, 2025

HYD: బతుకమ్మకు రావాలని కవితకు చింతమడక వాసుల ఆహ్వానం

image

ఈనెల 21న ఎంగిలిపూల బతుకమ్మ పండుగ జరగనుంది. ఆడబిడ్డలు ఎంతో ఆనందంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా కేసీఆర్ కుమార్తె కవితకు చింతమడక వాసులు ఆహ్వానం పలికారు. ఎంగిలి పూల బతుకమ్మకు రావాలని సొంత ఊరి నాయకులు, ప్రజలు కోరారు. తప్పకుండా వస్తానని బతుకమ్మ వేడుకలు జరుపుకుందామని ఊరి ప్రజలకు హామీ ఇచ్చారు.