News June 23, 2024

HYD: 40 ఎకో టూరిజం స్పాట్లు: మంత్రి

image

రాష్ట్రంలోని 12 సర్యూట్‌లలో 40 ఎకో టూరిజం స్పాట్లను గుర్తించినట్టు అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. సచివాలయంలో ఉన్న అటవీ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఎకో టూరిజం కన్సల్టేటివ్‌ కమిటీ ఉన్నత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. అడ్వెంచర్‌, రిక్రియేషన్‌, ఆధ్యాత్మిక, వారసత్వ, సినీ, వెడ్డింగ్‌, నేచర్‌ వైల్డ్‌లైఫ్‌, హెరిటేజ్‌-కల్చర్‌ తదితర అంశాల ఆధారంగా మరిన్ని ప్రాంతాలను గుర్తిస్తామన్నారు.

Similar News

News October 4, 2024

దసరా పండుగకు 6000 ప్రత్యేక బస్సులు

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్ళే ప్రయాణీకులకు ఇబ్బంది కలుగకుండా TGRTC 6000 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిందని కూకట్పల్లి ఆర్టీసీ డిపో డీఎం హరి తెలిపారు. రద్దీకి అనుగుణంగా జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి ప్రాంతాల నుంచి కరీంనగర్, నిజామాబాద్, హనుమకొండ, వరంగల్, MBNR, విజయవాడ, రాజమండ్రి, అమలాపురం, కాకినాడ, కర్నూల్, అనంతపురం ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నట్లు డీఎం స్పష్టం చేశారు.

News October 4, 2024

గోవా వెళ్తున్నారా..? సికింద్రాబాద్ నుంచి 2 ట్రైన్లు

image

సికింద్రాబాద్ నుంచి గోవాకు ట్రైన్స్ పెంచాలని ఉన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఈ క్రమంలో గోవాకు వారానికి రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడవనున్నాయి. ఇవి అక్టోబర్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇవి సికింద్రాబాద్ నుంచి గోవా మధ్య నడుస్తాయి. సికింద్రాబాద్- వాస్కోడగామా రైలు (17039/17040) బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి గురు, శనివారాల్లో వాస్కోడగామా నుంచి నడుస్తుంది.

News October 3, 2024

HYD: గుడ్డిగా నమ్మితే నట్టేట మునుగుతారు.. జాగ్రత్త!

image

‘కర్ణుడి చావుకు సవాలక్ష’ కారణాలు అన్నట్టు HYDలో సైబర్ నేరాలతో రూ.కోట్లు మోసపోతున్న పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి. అధిక వడ్డీతో ఆశ చూపటం, ట్రేడింగ్, కస్టమర్ కాల్ సెంటర్, హెల్ప్ లైన్ పేరిట, హై ప్యాకేజీ జాబ్, OTP మోసాలు, ఫేక్ లింకులు, ఫేక్ కాల్స్, ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్, ఉచిత విదేశీ ప్రయాణాలు, మ్యాట్రిమోనీ పేరిట మాయ మాటలు చెప్పి నట్టేట ముంచి రూ.కోట్లు కొల్లగొట్టేస్తున్నారు. జర జాగ్రత్త!