News August 9, 2024

HYD: 5 లక్షల మంది మహిళలకు AIలో శిక్షణ

image

ఏఐ రంగంలో మహిళా సాధికారత సాధించేందుకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), సౌత్ ఏషియన్ ఉమెన్ ఇన్ టెక్నాలజీ (ఎస్ఏడబ్ల్యు ఐటీ), ఎడ్యుటెక్ కంపెనీ గువీ సంయుక్తంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ప్రపంచంలోకెల్లా మహిళలకు అతిపెద్ద శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నాయి. జెన్ ఏఐ లెర్నింగ్ ఛాలెంజ్ పేరిట సెప్టెంబర్ 21న ఏకంగా 5 లక్షల మంది మహిళలకు శిక్షణ అందించనున్నాయి.

Similar News

News November 7, 2025

GOOD NEWS: బీటెక్‌ చేస్తే GHMCలో ఉద్యోగాలు

image

GHMC, అర్బన్ లోకల్ బాడీస్‌లో ఔట్‌ సోర్సింగ్ ప్రాతిపదికన సైట్ ఇంజినీరు, జూనియర్ ప్లానింగ్ పర్సనల్ పోస్టులకు దరఖాస్తులను NAC ఆహ్వానిస్తోంది. సైట్ ఇంజినీర్ 40 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. B.E/B.Tech/AMIE(సివిల్ ఇంజినీరింగ్) చేసిన వారు అర్హులు. 15 జూ.ప్లానింగ్ పోస్టులకు B.Arch/ B. Plan/ MURP/M (ప్లానింగ్) చేసి ఉండాలి. దరఖాస్తులకు NOV 8 చివరి తేదీ. వివరాలకు www.nac.edu.inను సంప్రదించండి. SHARE IT

News November 7, 2025

MGBS నుంచి పంచ శైవక్షేత్రాలకు స్పెషల్ బస్సులు

image

కార్తీకమాసం సందర్భంగా పంచశైవక్షేత్రాల దర్శనానికి స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు TGSRTC అధికారులు వెల్లడించారు. అమరావతి అమరలింగేశ్వరస్వామి, భీమవరం సోమేశ్వరస్వామి, ద్రాక్షారామం భీమేశ్వరస్వామి, సామర్లకోట భీమలింగేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించేలా బస్సు సేవలు తీసుకొచ్చారు. ప్రతి ఆదివారం రాత్రి 8 గంటలకు MGBS నుంచి బస్సు బయలుదేరుతంది. తిరిగి మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.
SHARE IT

News November 7, 2025

నవీన్ యాదవ్‌పై ఈసీకీ బీఅర్ఎస్ ఎంపీల ఫిర్యాదు

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో సీఎం, మంత్రులు, కాంగ్రెస్ నాయకుల కోడ్ ఉల్లంఘించారని ఢిల్లీలోని ఈసీకి BRS MPలు గురువారం ఫిర్యాదు చేశారు. పోలింగ్ రోజున కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఓట్ల రిగ్గింగ్, దొంగ ఓట్లకు పాల్పడే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉపఎన్నిక నేపథ్యంలో తక్షణమే కేంద్ర బలగాల నియమించి, ప్రతి పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.