News October 13, 2025

HYD: 534 మంది మందుబాబులు పట్టుబడ్డారు!

image

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు శనివారం రాత్రి డ్రంక్& డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో 534 మంది పట్టుబడ్డట్లు పోలీసులు పేర్కొన్నారు. మొత్తం 435 బైకులు, 18 త్రీవీలర్, 79 ఫోర్ వీలర్‌లు, 2 హెవీ వెహికిల్స్ పట్టుబడ్డాయని, వాహనదారులను కోర్టు ముందు హాజరు పరుస్తామని పేర్కొన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Similar News

News October 13, 2025

ప్రధాని మోదీతో ఏపీ రైతుల సమావేశం

image

ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రైతుల సమావేశంలో ఏపీ నుంచి ఏడుగురు రైతులు పాల్గొన్నారు. వీరిలో G. కొండూరు మండలం, చెవుటూరు గ్రామానికి చెందిన మహిళా రైతు రమాదేవి తన రెండెకరాల మామిడి తోటలో ప్రకృతి సేద్యం ద్వారా కూరగాయలు, పప్పుదినుసులు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇదే సమావేశంలో ఏపీ ఆక్వా రంగ ప్రతినిధులు, ఆక్వా రైతులకు రాయితీలు అందించాలని ప్రధానిని కోరారు.

News October 13, 2025

మెదక్: వరికి తెగులు.. రైతులకు గుబులు

image

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల జరిగిన వాతావరణ మార్పుల కారణంగా పలు గ్రామాల్లో వరి పంటకు కోత దశలో తెగులు సోకింది. మెడ విరుపు, కంకి నల్లి, దోమపోటు సోకి జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇదివరకు వర్షాల కారణంగా చాలా వరకు నష్టపోయిన రైతులు తెగులు కారణంగా పూర్తి దశలో నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడి తెగుల కారణంగా ఏరులో వేసినట్లుగా ఉందన్నారు.

News October 13, 2025

జగిత్యాల: స్కాలర్షిప్స్.. 3 రోజులే ఛాన్స్..!

image

BD కార్మికుల పిల్లల స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు ఈనెల 15తో ముగుస్తుందని BD కార్మికుల దవాఖాన వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. బీడీ కార్మికుల పిల్లలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆన్లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. కాగా, సెప్టెంబర్ 30తో గడువు ముగియాల్సి ఉండగా మరోసారి లాస్ట్ డేట్‌ను 15కు పొడిగించారు.