News March 14, 2025
HYD: 5K రన్కు హాజరు కావాలని వినతి

ఆదివారం ఉదయం 6 గంటలకు ఆల్విన్కాలనీ 124 డివిజన్ పరిధిలోని తులసి వనంలో అవని ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5K రన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రులు జూపల్లి కృష్ణరావు, పొన్నం ప్రభాకర్ను కలసి అవని ట్రస్ట్ ఛైర్మన్ శిరీష సత్తూర్ ఆహ్వానించారు. ఆదివారం ఉ.6 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు.
Similar News
News December 19, 2025
నల్గొండ: ఈనెల 22న మాక్ డ్రిల్: సీఎస్

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ముందస్తు అప్రమత్తతతోనే ప్రాణనష్టాన్ని నివారించగలమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) రామకృష్ణారావు పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ‘మాక్ ఎక్సర్సైజ్’ను విజయవంతం చేయాలని కోరారు.
News December 19, 2025
విపత్తుల నిర్వహణ సన్నద్ధతపై ఈనెల 22న మాక్డ్రిల్

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగాఎలా ఎదుర్కోవాలనే అంశాలపై ఈనెల 22వ తేదీన చిన్నవడ్డేపల్లి చెరువు ప్రాంతంలో ప్రయోగాత్మకంగా చేపట్టే మాక్ ఎక్సర్ సైజ్ ను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డా.సత్యశారద అధికారులను ఆదేశించారు. విపత్తులు సంభవించినప్పుడు ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు తక్షణ చర్యలపై సన్నద్ధత కోసం ఈమాక్ ఎక్సర్ సైజ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
News December 19, 2025
NTR: జిల్లా విద్యాశాఖ అధికారిణిగా ఎల్. చంద్రకళ

ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖ అధికారిణిగా ఎల్. చంద్రకళ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. దీంతో STU జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్. జార్జ్ వాషింగ్టన్, సభ్యులు, జిల్లా విద్యాశాఖ అధికారిణి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కతో అభినందనలు తెలియజేశారు. ఏ. కొండూరు మండలంలోని పాఠశాల అభివృద్ధికి సహకరించాలని, వారు కోరారు.


