News March 14, 2025

HYD: 5K రన్‌కు హాజరు కావాలని వినతి

image

ఆదివారం ఉదయం 6 గంటలకు ఆల్విన్‌కాలనీ 124 డివిజన్ పరిధిలోని తులసి వనంలో అవని ట్రస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న 5K రన్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మంత్రులు జూపల్లి కృష్ణరావు, పొన్నం ప్రభాకర్‌ను కలసి అవని ట్రస్ట్ ఛైర్మన్ శిరీష సత్తూర్ ఆహ్వానించారు. ఆదివారం ఉ.6 గంటల కార్యక్రమం ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు.

Similar News

News November 6, 2025

పెరిగిన ఓటింగ్ శాతం.. ఎవరికి సానుకూలం?

image

బిహార్‌లో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ పర్సంటేజ్ 57.29శాతం కాగా ఇవాళ జరిగిన ఫస్ట్ ఫేజ్‌లో సా.5 గంటల వరకే 60.13శాతం పోలింగ్ నమోదైంది. సా.6 గంటల వరకు లెక్కేస్తే ఇది మరింత పెరగనుంది. దీంతో పర్సంటేజ్ పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తమకే సానుకూలమంటూ JDU-BJP నేతృత్వంలోని NDA, RJD-INC నేతృత్వంలోని మహా గఠ్ బంధన్ కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

News November 6, 2025

సోన్: నీటి కుంటలో జారి పడి మహిళ మృతి

image

సోన్ మండలం, వెల్మల్ గ్రామానికి చెందిన మూడ సాయవ్వ (47) గురువారం బట్టలు ఉతుకుతుండగా ప్రమాదవశాత్తు నీటికుంటలో జారిపడి మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

News November 6, 2025

జనగామ జిల్లాలో రేపు ‘వందే మాతరం’ సామూహిక గీతాలాపన

image

మహాకవి బంకిమ్ చంద్ర ఛటర్జీ రచించిన “వందే మాతరం” గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రేపు (శుక్రవారం) ఉదయం 10 గంటలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల్లో సామూహిక గీతాలాపన చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తెలిపారు. ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.