News July 3, 2024

HYD: 7 నుంచి అంధ అభ్యర్థులకు నిర్ధారణ పరీక్షలు

image

గ్రూప్-4 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనలో భాగంగా అంధ అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం హాజరు కావాల్సి ఉంటుందని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి ఈ.నవీన్ నికోలస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంధ అభ్యర్థులు ఈనెల 7వ తేదీ నుంచి 27వ తేదీ వరకు మెహిదీపట్నం సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు ఎదుట ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.

Similar News

News September 17, 2025

హస్తంలో చిచ్చుపెట్టిన జూబ్లీహిల్స్

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక హస్తం పార్టీలో చిచ్చు పెట్టింది. అభ్యర్థి ఎంపిక అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. పాత నేతలంతా టికెట్ కోసం హస్తిన నుంచి ఫైరవీ మొదలెట్టారు. దానం నాగేందర్‌, అంజన్ కుమార్, నవీన్ కుమార్, PJR కుమార్తె విజయారెడ్డి టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీసీ నేతను పోటీకి దింపేందుకు INC నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పుడు CM, TPCC చీఫ్ నిర్ణయమే కీలకంగా మారుతోంది.

News September 17, 2025

నిజాం ఒక్కడు కాదు.. ఒక వంశం

image

అసఫ్ జా వంశానికి చెందిన రాజులే ఈ నిజాంలు. 1724లో హైదరాబాద్‌లో వీరి పాలన మొదలై, 1948 వరకు (225 ఏళ్లు) పాలించారు. నిజాం చెప్పిందే రాజ్యాం.. చేసింది చట్టం. వీరిలో నిజాం ఉల్ ముల్క్(1724-1748) మొదటివాడు. నిజాం అలీఖాన్(1762-1802), నాసిర్ ఉద్దౌలా ఫర్జుందా అలీ(1829-1857), అఫ్జల్ ఉద్దౌలా మీర్ టెహ్షియత్ అలీ ఖాన్(1857-1869), ఫతే జంగ్ మహబూబ్ అలీ ఖాన్(1869-1911), ఇక చివరి వాడే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(1911-1949).

News September 17, 2025

HYD: పసిప్రాయంలోనే.. పోరాటంలో

image

1948 SEP 17..గౌలీపురా గల్లీ జనంతో నిండింది. అందరి దృష్టి స్వాతంత్ర్య సమరయోధుడు రాజ్‌ బహదూర్‌ గౌర్‌ చెల్లెలు అవ్‌ధీశ్‌ రాణి ఇంటి గుమ్మానికి వేలాడుతున్న రేడియోపైనే ఉంది. ‘HYD సంస్థానం భారత్‌లో విలీనమైంది’ అని ప్రకటించగానే ఎగిరి గంతేశారు. దీపావళికి ఇంటికొచ్చిన మగ్దూం, జావేద్‌ రిజ్వీలను పోలీసుల నుంచి కాపాడింది. ‘పాల్‌రాబ్సన్‌’ కోడ్‌తో సమరయోధులకు భోజనం, సమాచారం చేరవేసి పోరాటంలో 8ఏళ్లకే భాగమైంది.