News July 5, 2024
HYD: 8వ అంతస్తు నుంచి దూకి మహిళ ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720156706375-normal-WIFI.webp)
MBBS పూర్తి చేసిన మహిళ మతిస్థిమితం కోల్పోయి అపార్ట్మెంట్ 8వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ASరావు నగర్కు చెందిన నిహారిక రావు(29)కు రెండేళ్ల క్రితం వివాహమైంది. అయితే గత కొంతకాలంగా మానసిక ఆరోగ్య పరిస్థితి సరిగ్గా ఉండటం లేదు. దీంతో రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ 8వ అంతస్తు నుంచి దూకడంతో కారుపై పడి మృతి చెందింది. కేసు నమోదైంది.
Similar News
News July 8, 2024
HYD: గోల్కొండ జాతర.. కిక్కిరిసిన బస్సులు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720411971894-normal-WIFI.webp)
HYD గోల్కొండ జాతరను వీక్షించేందుకు ఈరోజు ఉదయం నుంచే సికింద్రాబాద్, చార్మినార్, అఫ్జల్గంజ్, ఉప్పల్, మెహదీపట్నం, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, కూకట్పల్లి, మియాపూర్, జవహర్నగర్, మేడ్చల్, వికారాబాద్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ సహా సెట్ విన్ బస్సుల్లో భక్తులు కిక్కిరిసిపోతున్నారు. లక్షల మంది రానుండడంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.
News July 8, 2024
HYD: పెళ్లి కావడం లేదని చనిపోయాడు..!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720407333103-normal-WIFI.webp)
పెళ్లి కావడం లేదని ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. హనుమకొండ జిల్లా పరకాల మండలం నాగారానికి చెందిన సి.బాబు(27), ఆయన అన్న రాజు HYD మియాపూర్లోని మెట్రో రైలు డిపోలో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఇటీవల బాబు స్వగ్రామానికి వెళ్లి రాత్రి ఉరేసుకున్నాడు. పెళ్లి కావడం లేదని మనస్తాపంతో తన కొడుకు చనిపోయాడని అతడి తల్లి సరోజన PSలో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News July 8, 2024
HYD: నేడు వనమహోత్సవం ప్రారంభం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720406527556-normal-WIFI.webp)
హైదరాబాద్లో ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు నేడు వనమహోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటలకు ఉప్పల్ సర్కిల్-2, హబ్సిగూడ సర్కిల్- 8, రామంతాపూర్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.