News October 10, 2025
HYD: 8 ఏళ్ల బాలికపై అత్యాచారం

సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడు గంజాయి మత్తులో బాలిక సోదరుడి ముందే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారి అనారోగ్యానికి గురి అవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. బాధితురాలి తల్లి సైదాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News October 10, 2025
OU: డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువు పొడగింపు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ గడువును పొడగించినట్లు అధికారులు తెలిపారు. బీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ ఆనర్స్, బీబీఏ, బీఎస్డబ్ల్యూ తదితర కోర్సుల 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును ఈ నెల 14వ తేదీ వరకు సంబంధిత కళాశాలల్లో చెల్లించవచ్చని చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో 17వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
News October 10, 2025
జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి కోసం WAITING

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ తమ పార్టీ అభ్యర్థులు ప్రకటించగా బీజేపీ మాత్రం ఇంకా వెనుకంజలో ఉంది. పోటీ చేయబోయే అభ్యర్థి ఎవరనేది ఇంకా నిర్ణయించలేదు. 3, 4 పేర్లను రాష్ట్ర నాయకత్వం ఢిల్లీ పెద్దలకు పంపించింది. 2, 3 రోజుల్లో పార్టీ క్యాండిడేట్ ఎవరనేది ప్రకటిస్తామని బీజేపీ TG చీఫ్ రామచందర్ రావు తెలిపారు. కాగా కార్యకర్తల్లో అభ్యర్థి ఎవరనే టెన్షన్, ఉత్సాహం నెలకొంది.
News October 10, 2025
జూబ్లీహిల్స్ బై పోల్: రేపటినుంచి బీజేపీ ప్రచారం

జూబ్లీహిల్స్లో రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రచారం జోరు పెంచాయి. నెక్ట్స్ రంగంలోకి బీజేపీ దిగనుంది. బీజేపీ తమ అభ్యర్థిని ఇంకా ఖరారు చేయకపోయినా ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించింది. కార్యకర్తలు, నాయకులు నియోజకవర్గ వ్యాప్తంగా రేపటి నుంచి ప్రచారం చేయాలని బీజేపీ చీఫ్ రామచందర్రావు ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదేశించారు.