News July 20, 2024

HYD: 80 మంది హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు

image

చార్మినార్ జోన్‌లో 80 మంది హెడ్ కానిస్టేబుళ్లు ఏఎస్సైలుగా పదోన్నతులు కల్పిస్తూ మల్టీ జోన్-2 ఐజీపీ సత్యనారాయణ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ పరిధి హైదరాబాద్, సైబరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల యూనిట్ల నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకొని పదోన్నతులు కల్పించామన్నారు. అడ్ హక్ ప్రాతిపదికన కల్పించిన పదోన్నతులు ప్రభుత్వం నిబంధనల మేరకు ఆమోదం పొందుతాయని చెప్పారు.

Similar News

News August 17, 2025

HYD: ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి.. రిమాండ్

image

ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడి హతమార్చిన నిందితుడు కమర్‌ను ఉప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకొని శనివారం రిమాండ్‌కు తరలించారు. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డ విషయం ఇంట్లో చెబుతాడన్న భయంతో కమర్ బాలుడిని హత్య చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

News August 16, 2025

HYD: ఖజానా దోపిడీ కేసులో ఇద్దరు అరెస్ట్

image

చందానగర్ ఖజానా దోపిడీ కేసులు ఇద్దరిని అరెస్టు చేసినట్లు మాదాపూర్ DCP వినీత్ తెలిపారు. బిహార్‌కు చెందిన ఆశిష్, దీపక్‌ను అరెస్టు చేశామని, వీరిని పుణెలో పట్టుకున్నామన్నారు. చోరీ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించామని, నిందితులంతా బిహార్ వాసులుగా గుర్తించామన్నారు. నిందితుల నుంచి గోల్డ్ కోటెడ్ సిల్వర్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

News August 15, 2025

రంగారెడ్డి కలెక్టరేట్‌లో వేం నరేందర్ రెడ్డి జెండా ఆవిష్కరణ

image

79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మాల్ రెడ్డి రంగారెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డితో పాటు పలువురు కార్పొరేషన్ ఛైర్మన్లు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.