News May 17, 2024
HYD: 82 ఫిర్యాదులు.. 65 పరిష్కారం
GHMC విపత్తుల విభాగానికి వరద, చెట్లు కూలడంపై 82 ఫిర్యాదులు రాగా, డీఆర్ఎఫ్ సిబ్బంది రాత్రి 8 గంటల వరకు 65 సమస్యలను పరిష్కరించినట్లు తెలిపారు. ఉప్పల్, మలక్ పేట,చంద్రాయణగుట్ట, చార్మినార్, ఫలక్ నుమా,గుడిమల్కాపూర్, షేక్ పేట, అసెంబ్లీ, ఎన్టీఆర్ స్టేడియం, కేబీఆర్ పార్క్, కేకే పార్క్ ప్రాంతాల్లో 18 వరకు చెట్లు నేలకూలాయి. 63 చోట్ల వరద నీరు నిలిచిపోయిన ఫిర్యాదులు వచ్చాయన్నారు.
Similar News
News October 5, 2024
BREAKING: HYD: ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ SUSPEND
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఇన్స్పెక్టర్ సైదులును సస్పెండ్ చేస్తూ శనివారం రాచకొండ సీపీ సుధీర్బాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్స్పెక్టర్ గడ్డం మహేశ్ హత్య కేసులో డబ్బులు తీసుకుని ఓ వ్యక్తిని కేసు నుంచి తప్పించాడనే ఆరోపణల నేపథ్యంలో మహేశ్ తరఫు బంధువులు రెండు రోజుల క్రితం సీపీకి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం రాచకొండ సీపీ సుధీర్బాబు ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News October 5, 2024
HYD: ‘రేషన్ కార్డు లాగా FAMILY ఫొటో దిగాలి’
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డు జారీ ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా RR, MDCL జిల్లాల్లో ప్రయోగాత్మకంగా 26 చోట్ల సర్వే ప్రారంభమైంది. ముందు కుటుంబ పెద్దగా మహిళ పేరు, వివరాలు తీసుకుని ఆ తర్వాత మిగితా వారి డీటేల్స్ను అధికారులు తీసుకుంటున్నారు. కాగా ఫ్యామిలీ అంగీకరిస్తేనే రేషన్ కార్డు తరహాలో అంతా కలిసి ఉన్న ఒక ఫొటో తీసుకుంటున్నారు. SHARE IT
News October 5, 2024
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే 45 శాతం ఆదాయం: చంద్రశేఖర్
రాష్ట్ర రవాణా శాఖ ఆదాయంలో 45 శాతం ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే వచ్చిందని జిల్లా ఉప రవాణా కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ పేర్కొన్నారు. మణికొండలోని రవాణా శాఖ కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మొత్తం 33 జిల్లాల నుంచి రూ.3,195 కోట్ల ఆదాయం వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచే 45 శాతం ఆదాయం రావడం జరిగిందన్నారు.