News April 8, 2025
HYD: 82KM రైల్వే ప్రాజెక్టులో మన రైల్వే స్టేషన్లు..!

MMTS ప్రాజెక్టులో 82KM మేర 6 లైన్లను చేర్చినట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో ఘట్కేసర్- మౌలాలి క్వాడ్రిపులింగ్ (12 కి.మీ), తెల్లాపూర్- రామచంద్రాపురం కొత్త లైన్ (5 కి.మీ), మేడ్చల్- బొల్లారం డబ్లింగ్ (14 కి.మీ), ఫలక్నుమా- ఉమ్దనగర్ డబ్లింగ్ (1.4 కి.మీ), సనత్నగర్- మౌలాలి బైపాస్ డబ్లింగ్ (22 కి.మీ), సికింద్రాబాద్- బొల్లారం విద్యుద్ధీకరణ (15 కి.మీ) పనులు ఉన్నాయన్నారు.
Similar News
News December 3, 2025
వరంగల్ మార్కెట్లో పెరిగిన మొక్కజొన్న ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం పల్లికాయ, మొక్కజొన్న ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పచ్చి పల్లికాయ రూ.5,400 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. మొక్కజొన్నకు రూ.1,945 ధర వచ్చిందన్నారు. కాగా, గత రెండు రోజులతో పోలిస్తే నేడు మొక్కజొన్న ధర పెరిగింది. మక్కలు బిల్టీకి సోమవారం రూ.1,935 ధర రాగా, మంగళవారం రూ.1,905 ధర వచ్చింది.
News December 3, 2025
శ్రీకాకుళం: ‘స్ర్కబ్ టైఫస్ వ్యాధి..పరిశుభ్రతతో దూరం

‘స్ర్కబ్ టైఫస్’ వ్యాధి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శ్రీకాకుళం(D) కొత్తూరు, గార, హిరమండలంలో 10 రోజుల క్రితం కొంతమంది దీని బారిన పడ్డారు. ఎన్ని కేసులు నమోదయ్యాయో అధికార ప్రకటన రావాల్సి ఉంది. అపరిశుభ్ర ప్రాంతాల్లో నల్లిని పోలిన చిన్న పురుగు పెరుగుతోంది. ఇది కుట్టడంతో ఈ వ్యాధి వ్యాపిస్తోందని, తీవ్ర జ్వరం, అలసట, జలుబు ఉంటే తక్షణం చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. పరిశుభ్రత పాటించాలన్నారు.
News December 3, 2025
పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి: షర్మిల

కోనసీమకు TG ప్రజల దిష్టి తగిలిందంటూ Dy.CM పవన్ మాట్లాడటం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని షర్మిల మండిపడ్డారు. ‘పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ప్రాంతీయ విద్వేషాలను నింపొద్దు. మూఢ నమ్మకాలతో ప్రజలను కించపరచడం, ప్రభుత్వ వైఫల్యాన్ని దిష్టి అంటూ రుద్దడం సరికాదు. సముద్రం నుంచి పైకొస్తున్న ఉప్పు నీళ్లతో కొబ్బరి చెట్లు కూలాయి. చిత్తశుద్ధి ఉంటే ఉప్పునీటి ముప్పును తప్పించండి’ అని ట్వీట్ చేశారు.


