News February 18, 2025

HYD: 90% మంది సొంత స్థలం లేనివారే..!

image

గ్రేటర్ HYD వ్యాప్తంగా సొంతింటికి దరఖాస్తు చేసుకున్న వారిలో 90 % మంది సొంత స్థలం లేని వారే ఉన్నట్లు పరిశీలనలో అధికారులు గుర్తించారు. తొలిదశలో సొంత స్థలం ఉన్న వారికి అర్హులుగా గుర్తించి, ఇంటి నిర్మాణానికి అందించాలని సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. సర్వే మొత్తం పూర్తైన తర్వాత ఇందిరమ్మ కమిటీల పర్యవేక్షణలో లబ్ధిదారుల ఎంపిక జరగనుంది.

Similar News

News October 24, 2025

వనపర్తి: మద్యం షాపులకు 757 దరఖాస్తులు

image

వనపర్తి జిల్లాలోని 36 మద్యం షాపుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు నిన్నటితో ముగిసింది. జిల్లాలో మొత్తం 757 దరఖాస్తులు వచ్చాయని జిల్లా మద్య నిషేధ, ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ దరఖాస్తులకు లాటరీ పద్ధతి ద్వారా ఈ నెల 27న కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో దుకాణాల కేటాయింపు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి ఈ ప్రక్రియను చేపడతారని తెలిపారు.

News October 24, 2025

స్లీపర్ బస్సులు బ్యాన్ చేయాలా?

image

AP: కర్నూలు బస్సు <<18088805>>ప్రమాద<<>> ఘటనతో స్లీపర్ బస్సుల్లో సేఫ్టీపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. 8-9 అడుగుల ఎత్తు, సీట్ల మధ్య ఇరుకుగా ఉండటంతో ఎమర్జెన్సీ సమయంలో బయటికెళ్లడం కష్టమై ప్రాణనష్టం పెరుగుతోంది. వందలాది మంది మరణిస్తుండటంతో చైనా 2012లోనే స్లీపర్ బస్సులను బ్యాన్ చేసింది. మన దేశంలోనూ నిషేధించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మీరేమంటారు?

News October 24, 2025

బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే చర్యలు: SP

image

బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు హెచ్చరించారు. చంద్రగిరి సబ్ డివిజన్ MR.పల్లి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అఘాయిత్యం జరిగిన ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు వివరించారు.