News February 12, 2025
HYD: 9000113667 ఈ నంబర్కు కాల్ చేయండి..!

చెరువుల్లో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోను నంబర్ను 9000113667 కేటాయించింది. అలాగే చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని కోరింది. ఇప్పటి వరకు 48 కేసులు కాగా రాత్రీపగలు నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను పట్టుకున్నామని తెలిపింది.
Similar News
News October 13, 2025
జగిత్యాల: గ్రీవెన్స్ డే.. స్వయంగా సమస్యలు విన్న SP

జగిత్యాల జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ డేలో 10 మంది అర్జీదారుల సమస్యలను ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను ఫిర్యాదుల పూర్తి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. సమస్యలను త్వరగా, పెండింగ్ లేకుండా పరిష్కరించడం, ప్రతి ఫిర్యాదును ఆన్లైన్లో నమోదు చేసి పర్యవేక్షించడం చేయాలని సూచించారు.
News October 13, 2025
JGTL: మిషన్ భగీరథ నూతన EEగా జానకి బాధ్యతలు

జగిత్యాల జిల్లా మిషన్ భగీరథ నూతన ఈఈగా జానకి నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం మిషన్ భగీరథ కార్యాలయంలో ఈఈగా ఆమె బాధ్యతలు చేపట్టారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమాను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ DE జలంధర రెడ్డి, AEలు రాజశేఖర్, దీపక్ పాల్గొన్నారు.
News October 13, 2025
రెండో టెస్టు.. భారత్ టార్గెట్ ఎంతంటే?

రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడిన వెస్టిండీస్ 390 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ క్యాంప్బెల్(115), షై హోప్(103) సెంచరీలు చేశారు. చివరి వికెట్కు గ్రీవ్స్(50*), సీల్స్ (32) అద్భుతంగా పోరాడి 79 రన్స్ భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో WI భారత్ ముందు 121 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత బౌలర్లలో కుల్దీప్, బుమ్రా చెరో 3, సిరాజ్ 2 వికెట్లు తీశారు.