News February 24, 2025
HYD: ACB రైడ్స్లో పట్టుబడ్డ బిల్ కలెక్టర్

హైదరాబాద్లో ACB అధికారులు మెరుపుదాడులు చేస్తున్నారు. సోమవారం GHMC రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో రైడ్స్ చేశారు. ACB వివరాలు.. బిల్ కలెక్టర్ మధు ఓ పరిశ్రమకు సంబంధించి ఆస్తి పన్ను పెంచకుండా ఉండేందుకు రూ. లక్ష డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా తన ప్రైవేట్ అసిస్టెంట్ రమేశ్ ద్వారా రూ. 45,000 తీసుకుంటూ మధు పట్టుబడ్డాడు. అధికారులు దర్యాప్తు చేపట్టారు. లంచం అడిగితే 1064కు డయల్ చేయాలని ACB సూచించింది.
Similar News
News February 24, 2025
HYD: మైనర్లపై అధికారుల నిఘా..!

మాదకద్రవ్యాలపైనే కాదు మైనర్లకు సిగరెట్ అమ్మకాలపైనా అధికారులు HYDలో నిఘా పెంచారు. దీనికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు TG యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సందీప్ శాండిల్యా తెలిపారు. ఇవి సెల్ఫోన్లతో పాటు సీక్రెట్ కెమెరాలతో వీడియోలు తీస్తుంటాయి. ఈ వీడియోల ఆధరాంగా వ్యాపారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు. వరుస ఫిర్యాదుల నేపథ్యంలో ఈ బృందాలు కొనసాగుతాయిని ఆయన వెల్లడించారు.
News February 24, 2025
రంగారెడ్డి జిల్లాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు

రంగారెడ్డి జిల్లాలో అసాధారణ వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి నేపథ్యంలో జిల్లాలో పగటి సమయంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. కాగా రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో రాత్రుళ్లు చలి అధికంగా ఉంటోంది. అయితే పగటివేళల్లో అనేక ప్రాంతాలు ఎల్లో జోన్లో ఉండగా రాత్రి సమయాల్లోనూ పలు ప్రాంతాలు ఎల్లో జోన్లో కొనసాగుతున్నాయి.
News February 24, 2025
HYD: దాయాదుల మ్యాచ్.. భారీగా పందేలు

నిన్న దాయాదుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రూ.కోట్లల్లో పందేలు సాగాయి. బంతిబంతికి రూ.2000-2500 వరకు పందేలు వేసుకున్నారు. చందానగర్, మాదాపూర్, ఎల్బీనగర్, గోషామహల్, చిలకలగూడ, ముషీరాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్లు తెలుస్తోంది. మాదాపూర్లో ఓ స్థిరాస్తి వ్యాపారి వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి వీటిని నిర్వహించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు నిఘా ఉంచారు.