News February 24, 2025

HYD: AIతో 5 నిమిషాల్లో బిల్డింగ్ పర్మిషన్..!

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో భవనాల నిర్మాణానికి సంబంధించిన పర్మిషన్లు ఇచ్చేందుకు HMDA సిద్ధమవుతోంది. బిల్డ్ నౌ ఏఐ టెక్నాలజీ ద్వారా భవనాల అనుమతుల ప్రక్రియ సులభతరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న TGBPASS ద్వారా 40 అంతస్తుల భవనానికి పర్మిషన్ ఇచ్చేందుకు 20-30 రోజుల సమయం పడుతుండగా, AI టెక్నాలజీతో కేవలం ఐదు నిమిషాల్లోనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉందన్నారు.

Similar News

News September 17, 2025

జగిత్యాల: ‘మహిళల ఆరోగ్యం, కుటుంబ శక్తివంతం కోసం అభియాన్’

image

మహిళల ఆరోగ్యం బలోపేతం అయితేనే కుటుంబాలు శక్తివంతంగా ఉంటాయని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని మాతా శిశు ఆసుపత్రిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్వస్థ నారి ససక్త పరివార్ అభియాన్ (హెల్తీ ఉమెన్ ఎంపవర్ ఫ్యామిలీ కాంపెయిన్)లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో భాగంగా పోషణ మాసం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.

News September 17, 2025

జగిత్యాల: మహిళలు సంపూర్ణ ఆరోగ్యం సాధించాలి: ఎమ్మెల్యే

image

మహిళలు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకొని సంపూర్ణ ఆరోగ్యం సాధించాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని మాతా శిశు కేంద్రంలో బుధవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం చేపట్టిన స్వస్థనారి స్వసక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషక విలువలపై కూడిన ఆహారం తీసుకోవాలని మహిళలకు సూచించారు. జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.

News September 17, 2025

కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం తక్షణ చర్యలు: కోదండ రెడ్డి

image

కుండపోత వర్షాల వల్ల నష్టం జరగకుండా కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. సహాయక బృందాలు చర్యలు చేపట్టి 1,251 మందిని కాపాడాయన్నారు. వరదల వల్ల నష్టపోయిన 1,737 నివాస గృహాలకు రూ.1.85 లక్షల చొప్పున నష్టపరిహారం మంజూరు చేసినట్లు వెల్లడించారు. ప్రాణాలు కోల్పోయిన ఆరుగురి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందజేస్తామన్నారు.