News August 19, 2024

HYD: ASCI డైరెక్టర్ జనరల్ బాధ్యతలకు రమేష్ కుమార్

image

HYDలోని ఖైరతాబాద్ సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్‌కాలేజ్ ఆఫ్ ఇండియా(ASCI) డైరెక్టర్ జనరల్ బాధ్యతలకు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ నియమితులయ్యారు. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం స్టాఫ్ కాలేజీ డైరెక్టర్ బాధ్యతల్లో నూతన ప్రణాళికతో ముందుకు వెళ్తామని తెలిపారు.

Similar News

News November 16, 2025

HYD: స్మార్ట్‌ఫోన్‌ అతి వినియోగం.. సమస్యలు ఇవే!

image

స్మార్ట్‌ఫోన్‌ను అతిగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన భుజం, మెడ, వెన్నునొప్పి కేసులు పెరుగుతున్నాయని NIMS వైద్యులు చెబుతున్నారు. చిన్న వయస్సులోనే స్పాండిలైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు బయట పడుతున్నాయని హెచ్చరించారు. గంటల తరబడి ఫోన్‌లో తల వంచడం వలన నాడులు, కండరాలపై ఒత్తిడి పెరిగి దీర్ఘకాలిక నొప్పులు వస్తున్నాయని, ప్రతి 30 నిమిషాలకోసారి విరామం తీసుకోవడం మంచిదని సూచించారు.
SHARE IT

News November 16, 2025

జూబ్లీహిల్స్ గెలుపు‌తో ప్రజాపాలనకు 5 స్టార్ రేటింగ్: చనగాని

image

జూబ్లీహిల్స్ గెలుపు ప్రజాపాలనకు 5 స్టార్ రేటింగ్ లాంటిదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. శనివారం గాంధీ‌భవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రానున్న రోజుల్లో యువతకు అధిష్ఠానం పెద్దపీట వేస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల నమ్మకం పెరిగింది. 75 ఏళ్ల రాష్ట్రంలో ఉద్యమకారుల పాడే మోసిన సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో ఉంటారు. కేటీఆర్ డ్రామా, డీజే ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు’ అని పేర్కొన్నారు.

News November 15, 2025

రంగారెడ్డి కలెక్టరేట్‌లో కుర్చీలను ఇలా వాడుతారా?

image

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. పార్సిల్, ఇతర వస్తువులను తరలించేందుకు సిబ్బంది కొత్త పంథా ఎంచుకున్నారని కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అట్ట డబ్బాలను తరలించేందుకు ట్రాలీలను వాడాల్సింది పోయి.. ఏకంగా ఆఫీసు కుర్చీలనే ఉపయోగిస్తున్నారని వాపోయారు. కుర్చీలను ఇలా వాడడం వీరికే చెల్లిందని కలెక్టరేట్‌‌కు వచ్చిన వారు గుసగుసలాడుకుంటున్నారు.