News March 16, 2024

HYD: ముస్లింలపై దాడులు పెరిగి పోతున్నాయి: ఒవైసీ

image

దేశంలోని ముస్లింలపై దాడులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలు అణచివేతకు గురవుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, HYD ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం సందర్భంగా ఆయన చార్మినార్ మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు, యాముల్ ఖురాన్ పఠనం కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఐఎం చేస్తున్న అభివృద్ధి పనులపై వివరించారు.

Similar News

News September 2, 2025

HYD: అందుబాటులోకి వచ్చిన హైడ్రా టోల్ ఫ్రీ నంబర్

image

హైడ్రాకు సంబంధించిన ఫిర్యాదులు స్వీక‌రించ‌డానికి టోల్‌ఫ్రీ నంబ‌ర్ 1070 అందుబాటులోకి వ‌చ్చింది. 1070 నంబ‌ర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయ‌వ‌చ్చున‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఈరోజు తెలిపారు. హైడ్రా ప్రజావాణికి రాలేని వారు చెరువులు, నాలాలు, పార్కులు, ప్ర‌భుత్వ భూములు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జాకు గురైతే వెంట‌నే ఈ నంబర్‌కి కాల్ చేయవచ్చన్నారు.

News September 2, 2025

HYD: శిల్పారామం వేదికగా సందడి చేయనున్న నిఫ్ట్ విద్యార్థులు

image

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న NIFT (నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) విద్యార్థులు శిల్పారామంలో సందడి చేయనున్నారు. ఈనెల 12 నుంచి 17 వరకు తమ ప్రతిభను నిరూపించుకోనున్నారు.  భారతీయ హస్తకళల గొప్పదనాన్ని వివరించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. విద్యార్థులు తయారు చేసిన ఫ్యాషన్ దుస్తులు, వస్తువులు ఇక్కడ ప్రదర్శిస్తారు.

News September 2, 2025

HYD: తెలంగాణ ప్రజల బాగోగులే KCRకు ముఖ్యం: సబితాఇంద్రారెడ్డి

image

కవిత సస్పెన్షన్‌పై మాజీ మంత్రి, మహేశ్వరం BRS ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై, పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించడంతో కవితను సస్పెండ్ చేశారని, ఈ నిర్ణయం హర్షణీయమని ఆమె పేర్కొన్నారు. పార్టీ, తెలంగాణ ప్రజల బాగోగులు తనకు ముఖ్యమని కేసీఆర్ మరోసారి నిరూపించారని అన్నారు. BRSపై ప్రజల్లో మరింత విశ్వాసం నిలబెట్టడానికి ఇలాంటి నిర్ణయాలు అవసరమని ఆమె పేర్కొన్నారు.