News March 25, 2024
HYD: BRS చతికిల పడింది: ఎంపీ

అభివృద్ధికి పాటుపడతానని కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. HYD శేరిలింగంపల్లిలో ఇన్ఛార్జి జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. BRS పార్టీ చతికిల పడిందని అన్నారు. BJPని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తాను అండగా ఉంటానని, భారీ మెజారిటీతో తనను గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
Similar News
News September 17, 2025
HYD: ప్రపంచాన్ని ఆకర్షించేలా మూసీని మారుస్తాం: సీఎం

మూసీని శుద్ధి చేసి HYDను సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తేల్చిచెప్పారు. ప్రజాపాలన వేడుకల్లో మాట్లాడుతూ.. మూసీ చుట్టూ బతుకుతున్న ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతామని, మూసీని శుద్ధి చేసి కొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తామన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా మూసీ నదిని మారుస్తామన్నారు.
News September 17, 2025
HYD: ఆపరేషన్ పోలోకు తక్షణ కారణం ఏంటంటే?

1948 SEP 10న నిజాం UNOలో భారత్పై ఫిర్యాదు చేయడంతో ఆపరేషన్ పోలోకు తక్షణ కారణమైంది. భారత్ HYD సంస్థానాన్ని ఆక్రమించబోతోంది, యథాతద ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని అందులో పేర్కొన్నారు. దీనిపై సర్దార్ పటేల్ కఠిననిర్ణయం తీసుకున్నారు. SEP13న బలగాలు HYD వైపు బయలుదేరాయి. SEP 17న నిజాం లొంగిపోయారు. ఒక దేశం మరొక దేశంపై దండెత్తడం చట్టవిరుద్ధమని, సైనిక ఖర్చును వైద్యశాఖ ఖాతాలో వేశారు. HYD సంస్థానం విలీనం అయింది.
News September 17, 2025
HYDలో తొలిసారి జాతీయ జెండా ఎగిరిందిక్కడే

దేశవ్యాప్తంగా 1947 AUG 15 నుంచి జాతీయ జెండాలు స్వేచ్ఛగా రెపరెపలాడుతున్న సమయంలో నిజాం ప్రభుత్వం నిరంకుశత్వంలో HYDలో ఎగరనివ్వలేదు. ఏడాది తర్వాత వల్లభాయ్ పటేల్ ఆపరేషన్ పోలో ద్వారా 1948 SEP 17న తొలిసారిగా సికింద్రాబాద్ బొల్లారం రాష్ట్రపతి నిలయంలో జాతీయ జెండా అధికారికంగా రెపరెపలాడి హైదారబాదీల స్వాతంత్య్ర కాంక్షను నెరవేర్చింది. అప్పుడు నిర్మించిన జెండా దిమ్మెను నేటికీ ప్రదర్శనకు అలాగే ఉంచారు.