News April 11, 2025
HYD: BRS రజతోత్సవ సభకు రూ.25 లక్షల విరాళం

ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే BRS రజతోత్సవ సభకు పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాశ్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందించారు. ఏర్పాట్లకు రూ.25 లక్షల చెక్కును ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ అవినాశ్ రెడ్డిని అభినందించారు.
Similar News
News November 27, 2025
రబ్బరు పాలను ఎలా సేకరిస్తారు?

హెక్టారు రబ్బరు తోట నుంచి ఏడాదికి దాదాపు 2000కి.గ్రా. దిగుబడి వస్తుంది. మొక్క నుంచి వచ్చే పాల కోసం చెట్టుపై బెరడును కొంత తొలగిస్తారు. కాండం నుంచి కారే రబ్బరు పాలను సేకరించడం కోసం డబ్బా లేదా కుండను పెడతారు. ఈ విధానాన్ని టాపింగ్ అంటారు. అయితే మొక్కకు గాటు పెట్టిన దాదాపు 4గంటల పాటు ఈ రబ్బరు పాల రూపంలో కారుతుంది. గడ్డకట్టే రబ్బరు పాలను ఫ్యాక్టరీకి పంపిస్తారు. మార్కెట్లో దీనికి మంచి డిమాండ్ ఉంది.
News November 27, 2025
సినిమా అప్డేట్స్

* మహేశ్ బాబు అన్న కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా తెరకెక్కే తొలి చిత్రానికి ‘శ్రీనివాస మంగాపురం’ టైటిల్ ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్. దీనికి అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు.
* రజినీకాంత్ జైలర్-2 సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
* రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘ధురంధర్’ మూవీ రన్టైమ్ 3.32 గంటలని తెలుస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది.
News November 27, 2025
వరంగల్ ఎంజీఎంలో ఫిర్యాదుల పెట్టె

వరంగల్ ఎంజీఎంలో సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు కలెక్టర్ సత్యశారద ఆసుపత్రిలో ప్రత్యేకంగా కంప్లైంట్ బాక్స్ను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎంజీఎంలో రోగులకు ఎదురవుతున్న సమస్యలపై చాలా ఫిర్యాదులు చేశారు. పేషెంట్లు, వారి కుటుంబీలకు కలిగిన అసౌకర్యం, అధికారులు, సిబ్బంది అవినీతిపైన భారీగా ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది.


