News April 11, 2025

HYD: BRS రజతోత్సవ సభకు రూ.25 లక్షల విరాళం

image

ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే BRS రజతోత్సవ సభకు పార్టీ రంగారెడ్డి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాశ్ రెడ్డి తన వంతు సహకారాన్ని అందించారు. ఏర్పాట్లకు రూ.25 లక్షల చెక్కును ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ KTRకు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ అవినాశ్ రెడ్డిని అభినందించారు.

Similar News

News February 9, 2026

కోరుట్ల: డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిన ఆర్టీసీ డ్రైవర్

image

మద్యం తాగి బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్ పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం సాయంత్రం బెల్లంపల్లి చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అనుమానం వచ్చి కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ డ్రైవర్ జక్కుల మల్లేశ్‌ను పరీక్షించగా మద్యం తాగినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మజారుద్దీన్ తెలిపారు.

News February 9, 2026

పాపం.. ఇషాన్ కిషన్‌!

image

దేశవాళీ ప్రదర్శనతో T20 WC జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్‌పై BCCI దయ చూపలేదు. తాజాగా రిలీజ్ చేసిన <<19095739>>సెంట్రల్ కాంట్రాక్ట్<<>> లిస్టులో అతనికి చోటు కల్పించలేదు. దీంతో కిషన్ మరికొంతకాలం వేచి చూడక తప్పదు. రంజీల్లో ఆడకుండా రెస్ట్ తీసుకోవడం, దేశవాళీ క్రికెట్‌ను నిర్లక్ష్యం చేశారని 2023-24 సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి ఇతనితో పాటు శ్రేయస్‌‌ను BCCI తొలగించింది. అయితే తాజా లిస్టులో అయ్యర్ గ్రేడ్-Bలో ఉన్నారు.

News February 9, 2026

నెల్లూరులో ఎవరి దారి వారిదే..!

image

TDP లో సమిష్టి న్యాయకత్వం మసక బారుతోంది. ఇటీవల ఓ సీనియర్ నేత విషయంలో ఇదే నిజమవుతుందని తెలుస్తోంది. కాకాణి గోవర్ధన్ రెడ్డి MLA సోమిరెడ్డిని పదే పదే టార్గెట్ చేస్తూ తిట్ల పురాణం చేస్తున్నా తోటి TDP నేతలకు అది పట్టడం లేదు. సోమిరెడ్డికి సపోర్ట్ చేసేందుకు, కాకాణిపై ఎదురుదాడికి ఎవరూ మొగ్గు చూపడం లేదు. ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో అని పలువురు చర్చించుకుంటున్నారు.