News March 19, 2024
HYD: ‘CM రేవంత్రెడ్డి సార్ మా నాన్నను కాపాడండి’

HYD తుక్కుగూడలో 2023 SEP 17న సోనియాగాంధీ జనగర్జన సభకు వచ్చిన సూర్యాపేట జిల్లా వాసి కొమ్ము భిక్షం.. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో హయత్నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం తన తండ్రి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, తమ పరిస్థితి దయనీయంగా ఉందని కుమారుడు కొమ్ము శ్రీకాంత్ కన్నీరు పెడుతున్నారు. సర్జరీకి రూ.లక్షల్లో ఖర్చవుతుందని, సీఎం ఆదుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 18, 2025
శంషాబాద్: గర్భంలోనే కవలలు మృతి.. భర్త ఆత్మహత్య

భార్య గర్భంలోని కవలలు మృతిచెందారనే దుఃఖంతో శంషాబాద్లోని సామ ఎన్క్లేవ్లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆతహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్య 8 నెలల గర్భిణీ. కవలల మరణ వార్త తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 18, 2025
శంషాబాద్: గర్భంలోనే కవలలు మృతి.. భర్త ఆత్మహత్య

భార్య గర్భంలోని కవలలు మృతిచెందారనే దుఃఖంతో శంషాబాద్లోని సామ ఎన్క్లేవ్లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆతహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్య 8 నెలల గర్భిణీ. కవలల మరణ వార్త తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News November 16, 2025
షాద్నగర్: ‘నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి’

షాద్నగర్ సమీపంలోని ఎల్లంపల్లి గ్రామ యువకుడు రాజశేఖర్ హత్యను బహుజన్ సమాజ్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ఖండించారు. ఆయన మాట్లాడుతూ.. రాజశేఖర్ను కిడ్నాప్ చేసి హత్య చేసిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హత్యకు ముందు మృతుడిని నిందితులు కిడ్నాప్ చేస్తే కుటుంబ సభ్యులు 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చినా ఎందుకు రక్షించలేదని ప్రశ్నించారు.


