News March 19, 2024
HYD: ‘CM రేవంత్రెడ్డి సార్ మా నాన్నను కాపాడండి’

HYD తుక్కుగూడలో 2023 SEP 17న సోనియాగాంధీ జనగర్జన సభకు వచ్చిన సూర్యాపేట జిల్లా వాసి కొమ్ము భిక్షం.. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో హయత్నగర్ పరిధిలో రోడ్డు ప్రమాదానికి గురై గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం తన తండ్రి ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, తమ పరిస్థితి దయనీయంగా ఉందని కుమారుడు కొమ్ము శ్రీకాంత్ కన్నీరు పెడుతున్నారు. సర్జరీకి రూ.లక్షల్లో ఖర్చవుతుందని, సీఎం ఆదుకోవాలని కోరుతున్నారు.
Similar News
News November 16, 2025
HYD: స్మార్ట్ఫోన్ అతి వినియోగం.. సమస్యలు ఇవే!

స్మార్ట్ఫోన్ను అతిగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన భుజం, మెడ, వెన్నునొప్పి కేసులు పెరుగుతున్నాయని NIMS వైద్యులు చెబుతున్నారు. చిన్న వయస్సులోనే స్పాండిలైటిస్ వంటి ఆరోగ్య సమస్యలు బయట పడుతున్నాయని హెచ్చరించారు. గంటల తరబడి ఫోన్లో తల వంచడం వలన నాడులు, కండరాలపై ఒత్తిడి పెరిగి దీర్ఘకాలిక నొప్పులు వస్తున్నాయని, ప్రతి 30 నిమిషాలకోసారి విరామం తీసుకోవడం మంచిదని సూచించారు.
SHARE IT
News November 16, 2025
జూబ్లీహిల్స్ గెలుపుతో ప్రజాపాలనకు 5 స్టార్ రేటింగ్: చనగాని

జూబ్లీహిల్స్ గెలుపు ప్రజాపాలనకు 5 స్టార్ రేటింగ్ లాంటిదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ అన్నారు. శనివారం గాంధీభవన్లో ఆయన మాట్లాడారు. ‘రానున్న రోజుల్లో యువతకు అధిష్ఠానం పెద్దపీట వేస్తుంది. ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల నమ్మకం పెరిగింది. 75 ఏళ్ల రాష్ట్రంలో ఉద్యమకారుల పాడే మోసిన సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో ఉంటారు. కేటీఆర్ డ్రామా, డీజే ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదు’ అని పేర్కొన్నారు.
News November 15, 2025
రంగారెడ్డి కలెక్టరేట్లో కుర్చీలను ఇలా వాడుతారా?

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. పార్సిల్, ఇతర వస్తువులను తరలించేందుకు సిబ్బంది కొత్త పంథా ఎంచుకున్నారని కార్యాలయానికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. అట్ట డబ్బాలను తరలించేందుకు ట్రాలీలను వాడాల్సింది పోయి.. ఏకంగా ఆఫీసు కుర్చీలనే ఉపయోగిస్తున్నారని వాపోయారు. కుర్చీలను ఇలా వాడడం వీరికే చెల్లిందని కలెక్టరేట్కు వచ్చిన వారు గుసగుసలాడుకుంటున్నారు.


