News September 25, 2024

HYD ఆంత్రప్రెన్యూర్ వ్యాఖ్యలపై దుమారం

image

భారత్‌లో నిరంతరం తప్పులను కనుగొనే వారు దేశంలో నివసించాలనే తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని HYD ఆంత్రప్రెన్యూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘భారతదేశంలో నిరంతరం లోపాలను కనుగొనే వ్యక్తులకి ఒక ప్రశ్న. మీరు ఇంకా ఇక్కడ ఎందుకున్నారు’ అంటూ నీరజ్ దుగర్ వ్యాఖ్యానించారు. దీంతో మార్పు కోసం తప్పుల్ని వెతకడం మంచిదే అని కొందరు, శరీరంలో లోపాలు ఉంటే దాన్ని వదిలేస్తారా? అంటూ మరికొందరు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.

Similar News

News October 20, 2025

బత్తాయిలో తొడిమ కుళ్లు తెగులును ఎలా నివారించాలి?

image

తొడిమ కుళ్లు సోకి, రాలిపోయిన కాయలను ఏరి నాశనం చేయాలి. తెగులు నివారణకు లీటరు నీటికి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా కార్బండిజం 1 గ్రాము కలిపి పిచికారీ చేయాలి. ప్రతి సంవత్సరం తొలకరిలో చెట్లలో ఎండుపుల్లలను కత్తిరించి నాశనం చేయాలి. శిలీంధ్రానికి ఆశ్రయమిచ్చే కలుపు మొక్కలను సమర్థవంతంగా అరికట్టేందుకు చెట్ల పాదుల్లో మల్చింగ్ పద్ధతిని అవలంబించాలి. తోటల్లో నీటి ఎద్దడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

News October 20, 2025

ప్రమోద్ కుటుంబానికి రూ.కోటి పరిహారం: డీజీపీ

image

TG: నిజామాబాద్‌లో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి డీజీపీ శివధర్ రూ.కోటి పరిహారం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. పదవీ విరమణ వరకు వచ్చే శాలరీ అందిస్తామని, 300 గజాల ఇంటి స్థలం మంజూరు చేయిస్తామన్నారు. పోలీస్ భద్రత సంక్షేమం నుంచి రూ.16 లక్షలు, పోలీస్ వెల్ఫేర్ నుంచి రూ.8 లక్షల పరిహారాన్ని రేపు అమరవీరుల సభలో సీఎం ప్రకటిస్తారని వెల్లడించారు.

News October 20, 2025

రియాజ్ మృతిని ధ్రువీకరించిన DGP

image

TG: ఎన్‌కౌంటర్‌లో <<18056602>>రియాజ్<<>> మృతిని డీజీపీ శివధర్ రెడ్డి ధ్రువీకరించారు. ‘నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రియాజ్ ఇవాళ బాత్రూం కోసం వెళ్లి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసుల నుంచి వెపన్ తీసుకుని రియాజ్ కాల్పులకు యత్నించాడు. ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో రియాజ్ చనిపోయాడు’ అని డీజీపీ వెల్లడించారు.