News May 21, 2024
HYD: FINE ARTS యూనివర్సిటీ వీసీగా జయేష్ రంజన్
HYD నగరం మాసాబ్ ట్యాంక్ వద్ద ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీగా జయేష్ రంజన్ నియమితులయ్యారు. 1992 IAS బ్యాచ్ అధికారి అయిన జయేశ్, అనేక ఉన్నత పదవులు చేపట్టి, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను తాజాగా.. ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీగా వీసీగా ప్రభుత్వం నియమించింది.
Similar News
News October 2, 2024
BREAKING: HYD: KTRపై PSలో ఫిర్యాదు
మాజీ మంత్రి, ఎమ్మెల్యే KTRపై HYD వనస్థలిపురం PSలో కాంగ్రెస్ నేత, TPCC మీడియా & కమ్యూనికేషన్స్ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఈరోజు ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాలనకు రూ.1.50 లక్షల కోట్లు కేటాయించారని అందులో రూ.25వేల కోట్లు ఢిల్లీ పెద్దలకు దోచి పెట్టేందుకే ఈ ప్రణాళిక చేశారని ఇటీవల KTR ఆరోపించారు. సీఎంపై, కాంగ్రెస్ అధిష్ఠానంపై తప్పుడు ఆరోపణలు చేసిన KTRపై తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
News October 2, 2024
HYD: చిన్ననాటి స్నేహితుడే చంపేశాడు!
దీప్తి శ్రీనగర్ సీబీఆర్ ఎస్టేట్లో సోమవారం జరిగిన హత్య కేసును మియాపూర్ పోలీసులు ఛేదించారు. భర్తతో విడిపోయిన స్పందన (29) అమ్మ, తమ్ముడితో కలిసి ఉంటోంది. సోమవారం హత్యకు గురి కావడంతో పోలీసులు ఆధారాలు సేకరించారు. చిన్ననాటి క్లాస్మేట్ బాలు హత్య చేసినట్లు గుర్తించారు. మృతురాలు భర్తతో విడిపోవడంతో ఆమెను ఎలాగైనా లొంగదీసుకోవాలని ప్రయత్నించగా ఒప్పుకోకపోవడంతో హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడన్నారు.
News October 2, 2024
HYD: దుర్గామాత మండపాలు.. అనుమతి తప్పనిసరి!
HYDలో దుర్గామాత మండపాలు ఏర్పాటు చేసేందుకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేశారు. https://policeportal.tspolice.gov.in/index.htm లింక్ ద్వారా దరఖాస్తు చేసుకొని, సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఫారంని సబ్బిట్ చేయాలని స్పష్టంచేశారు. మండపం ఎత్తు, నిమజ్జనం, నిర్వాహకుల సమాచారం అందులో పొందుపర్చాలి.
SHARE IT