News March 3, 2025
HYD: GIS సర్వేతో రూ.25.60 కోట్ల అదనపు ఆదాయం..!

గ్రేటర్లో మొత్తం 25 లక్షల ఇళ్లు ఉండగా, అందులోని 47,323 ఇళ్ల జీఐఎస్ సర్వే ఇప్పటికే పూర్తయిందని అధికారులు తెలిపారు. అందులో పన్ను పరిధిలోలేని 7,098 (15%) ఇళ్లు, తక్కువ పన్ను చెల్లిస్తోన్న 10,539 నిర్మాణాల లెక్కతేలాయి. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.25.60 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా జీహెచ్ఎంసీ వెలుపల 8.5 లక్షల ఇళ్లు ఉన్నట్టు, క్షేత్రస్థాయికి వెళ్తే ఆసంఖ్య 12.75 లక్షలు ఉండొచ్చని అంచనా.
Similar News
News November 27, 2025
మెదక్ జిల్లాలో మొదటి రోజు 55 నామినేషన్లు

మెదక్ జిల్లాలో మొదటి రోజు 55 సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అల్లాదుర్గంలో 5, రేగోడులో 6, పెద్ద శంకరంపేటలో 7, టేక్మాల్లో 5, పాపన్నపేటలో 13, హవెలిఘనాపూర్లో 16 చొప్పున నామినేషన్లు దాఖలు అయ్యాయి. అలాగే వాడు మెంబర్ స్థానాలకు టేక్మాల్ మండలంలో ఒకటి, హవేలిఘనపూర్లో మూడు నామినేషన్ దాఖలైనట్లు జిల్లా పంచాయతీ అధికారులు పేర్కొన్నారు. రేపు, ఎల్లుండి ఎక్కువ సంఖ్యలో నామినేషన్ దాఖలు అయ్యే అవకాశం ఉంది.
News November 27, 2025
ఎన్నికలకు అవసరమైన బందోబస్తు సిద్ధం: ADB SP

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన భద్రతా బందోబస్తు ఇప్పటికే సిద్ధం చేస్తున్నామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకునేలా పోలీసు విభాగం సన్నద్ధమైందన్నారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తే తప్పనిసరిగా రసీదులు, డాక్యుమెంట్లు ఉండాలని సూచించారు.
News November 27, 2025
జనగామ: పంచాయతీ ఎన్నికలు.. నిఖిల ఆదేశాలు

గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రత్యేక శ్రద్ధతో పని చేయాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు నిఖిల నోడల్ అధికారులకు సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జనగామ జిల్లాకి జనరల్ అబ్జర్వర్గా నిఖిల నియామకమైన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామ ప్రంచాయతీల ఎన్నికలు సజావుగా నిర్వహించాలని ఆదేశించారు.


