News March 3, 2025

HYD: GIS సర్వేతో రూ.25.60 కోట్ల అదనపు ఆదాయం..!

image

గ్రేటర్లో మొత్తం 25 లక్షల ఇళ్లు ఉండగా, అందులోని 47,323 ఇళ్ల జీఐఎస్ సర్వే ఇప్పటికే పూర్తయిందని అధికారులు తెలిపారు. అందులో పన్ను పరిధిలోలేని 7,098 (15%) ఇళ్లు, తక్కువ పన్ను చెల్లిస్తోన్న 10,539 నిర్మాణాల లెక్కతేలాయి. తద్వారా జీహెచ్ఎంసీకి రూ.25.60 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది. గూగుల్ మ్యాప్ ఆధారంగా జీహెచ్ఎంసీ వెలుపల 8.5 లక్షల ఇళ్లు ఉన్నట్టు, క్షేత్రస్థాయికి వెళ్తే ఆసంఖ్య 12.75 లక్షలు ఉండొచ్చని అంచనా.

Similar News

News March 4, 2025

ప్రమాదకరంగా ఫ్యాటీ లివర్.. ఇలా చేయాల్సిందే

image

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందర్నీ పట్టి పీడిస్తున్న సమస్య కాలేయపు కొవ్వు(ఫ్యాటీ లివర్). ప్యాకేజ్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్, మద్యపానం వంటి అలవాట్లు, అధిక బరువు వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతుంటుంది. జంక్ ఫుడ్, డ్రింక్స్‌ను దూరం పెట్టడం.. పోషకాహారం, వారానికి కనీసం 135 నిమిషాల వ్యాయామం దీనికి పరిష్కారాలని వైద్యులు చెబుతున్నారు. బరువు తగ్గడంతోపాటు గుడ్డు, చేపల్ని ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు.

News March 4, 2025

ముధోల్: ఇంట్లో పట్టపగలే బంగారం చోరీ

image

ముధోల్ మండలం వడ్తాల్ గ్రామంలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. ఎస్ఐ సంజీవ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భోజవ్వ తన కూతురి పెళ్లి కోసం బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన నగలను కొన్ని రోజుల క్రితం తీసుకువచ్చి ఇంట్లోని బీరువాలో దాచిపెట్టింది. కాగా సోమవారం దుండగులు 4 తులాల బంగారం, 10 తులాల వెండి ఎత్తుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.

News March 4, 2025

HYDలో శిరీషను చంపి డ్రామా!

image

మలక్‌పేట జమున టవర్స్‌లో శిరీష మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెది సహజ మరణం కాదని పోస్టుమార్టం నివేదికలో తేలింది. పోలీసుల వివరాలు.. 2016లో వినయ్‌ను శిరీష ప్రేమ వివాహం చేసుకుంది. మలక్‌పేటలో దంపతులు కాపురం పెట్టారు. ఆమెపై అనుమానంతో వినయ్ వేధించేవాడు. ఈ క్రమంలోనే భార్యను చంపి, గుండెపోటుతో మరణించినట్లు చిత్రీకరించాడు. చివరకు హత్య విషయం బయటపడడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

error: Content is protected !!