News December 8, 2024

HYD: GOOD NEWS.. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

image

ఆర్మీలో చేరాలనుకున్న వారికి సికింద్రాబాద్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ అధికారులు శుభవార్త తెలిపారు. 2025 జనవరి 6 నుంచి మార్చి 9 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుందని ప్రకటించారు. అగ్నివీర్ పోస్టుల కోసం ఈ ర్యాలీ జరగనుంది. స్పోర్ట్స్ మెన్ ఓపెన్ కోటా అభ్యర్థులు సికింద్రాబాద్ జోగేంద్ర సింగ్ స్టేడియంలో జనవరి 3వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు www.joinindianarmy@nic.in సైట్ సంప్రదించండి.

Similar News

News February 26, 2026

HYD: విద్యార్థులకు టెలి మనస్ సేవలు

image

TGBIE ఆధ్వర్యంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. పరీక్షల్లో ఒత్తిడి, భయం, నిరుత్సాహాన్ని ఎదుర్కొనే విద్యార్థులు మౌనం వహించకుండా తమ సమస్యలను పంచుకోవాలని సూచించారు. అవసరమైనప్పుడు నిపుణుల సహాయం పొందడం తప్పు కాదని పేర్కొన్నారు. మానసిక సహాయం కోసం టెలీ మానస్ హెల్ప్‌లైన్ 14416లో సంప్రదించాలని BIE ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ వెల్లడించారు.

News February 25, 2026

సైబరాబాద్‌ కమిషనరేట్‌కు కొత్తగా 2 పోలీస్ కేనైన్‌లు

image

తెలంగాణ సీఐడీ నుంచి రెండు పోలీస్ కేనైన్‌లు సైబరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయ్యాయి. దీంతో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న జాగిలాల సంఖ్య18కు చేరింది. పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల గుర్తింపు, ట్రాకింగ్ వంటి కీలక విధుల్లో ఇవి సేవలందించనున్నాయి. సీఐడీ నుంచి వచ్చిన ‘రానా’ (బెల్జియన్ మాలినోయిస్), ‘రాడో’ (లాబ్రడార్) నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు.

News February 25, 2026

RR: ఎగ్జామ్‌కు READY అయ్యారా?

image

ఇంటర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. రంగారెడ్డిలో 180 పరీక్షా కేంద్రాలు ఉండగా.. 84,301 మంది 1st ఇయర్ విద్యార్థులు, 70,171 మంది 2nd ఇయర్ విద్యార్థులు ఉన్నారు. జిల్లాలో 1,54,472 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. మాస్ కాపీయింగ్‌ జరగకుండా అలర్ట్ ఇచ్చే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద BNS 163 సెక్షన్ అమల్లో ఉంది. హాల్ టికెట్, పెన్నులు మర్చిపోకండి. ప్రశాంతంగా ఉండండి.