News December 8, 2024

HYD: GOOD NEWS.. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

image

ఆర్మీలో చేరాలనుకున్న వారికి సికింద్రాబాద్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ అధికారులు శుభవార్త తెలిపారు. 2025 జనవరి 6 నుంచి మార్చి 9 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుందని ప్రకటించారు. అగ్నివీర్ పోస్టుల కోసం ఈ ర్యాలీ జరగనుంది. స్పోర్ట్స్ మెన్ ఓపెన్ కోటా అభ్యర్థులు సికింద్రాబాద్ జోగేంద్ర సింగ్ స్టేడియంలో జనవరి 3వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు www.joinindianarmy@nic.in సైట్ సంప్రదించండి.

Similar News

News November 3, 2025

HYD: బస్సు ప్రమాదంపై KCR, KTR దిగ్భ్రాంతి

image

మీర్జాగూడ ప్రమాద ఘటనపై మాజీ CM KCR, మాజీ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు.

News November 3, 2025

మీర్జాగూడ ప్రమాదం.. కండక్టర్ సేఫ్

image

మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ప్రయాణికులతో పాటు డ్రైవర్ దస్తగిరి బాబు చనిపోయాడు. కండక్టర్ రాధ గాయాలతో బయటపడినట్లు తెలిసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్, తాండూరు MLA బుయ్యని మనోహర్, MLC పట్నం మహేందర్ పరామర్శించారు. మిగతా క్షతగాత్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News November 3, 2025

HYD: ఘోర ప్రమాదం తర్వాత దృశ్యాలు

image

చేవెళ్ల మం. మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం అనంతరం భయానక దృశ్యాలు వెలుగుచూశాయి. టిప్పర్ డ్రైవర్‌ డెస్క్ మొత్తం నుజ్జు నుజ్జు అయ్యింది. ఇక బస్సు ఒకవైపు మొత్తం ధ్వంసం అయ్యింది. ముందు భాగంతో పాటు వెనక చక్రాల వరకు క్యాబిన్ ఎగిరిపోయింది. రాడ్లు, సీట్లు ఇతరత్ర భాగాలు పూర్తిగా విరిగిపోయాయి. బస్సు, టిప్పర్ తాజా దృశ్యాలు చూసిన జనం హడలెత్తిపోయారు.