News December 8, 2024

HYD: GOOD NEWS.. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ

image

ఆర్మీలో చేరాలనుకున్న వారికి సికింద్రాబాద్‌లోని ఆర్మీ హెడ్ క్వార్టర్ అధికారులు శుభవార్త తెలిపారు. 2025 జనవరి 6 నుంచి మార్చి 9 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుందని ప్రకటించారు. అగ్నివీర్ పోస్టుల కోసం ఈ ర్యాలీ జరగనుంది. స్పోర్ట్స్ మెన్ ఓపెన్ కోటా అభ్యర్థులు సికింద్రాబాద్ జోగేంద్ర సింగ్ స్టేడియంలో జనవరి 3వ తేదీన హాజరు కావాల్సి ఉంటుంది. మిగతా వివరాలకు www.joinindianarmy@nic.in సైట్ సంప్రదించండి.

Similar News

News January 17, 2025

రంగారెడ్డి : హైదరాబాద్‌లో తగ్గిన వాయు కాలుష్యం

image

సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ వాసులంతా సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నివాస వాణిజ్య ప్రాంతాల్లో కాలుష్య కారకాలు గణనీయంగా తగ్గిపోగా.. పారిశ్రామిక వాడల్లో మాత్రం కాస్త అధికంగా నమోదైందన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ ముగియడంతో మళ్లీ హైదరాబాదులో కాలుష్యం గణనీయంగా పెరిగిపోతుందని అధికారులు పేర్కొన్నారు.

News January 17, 2025

బీసీ మేధావుల సదస్సులో రాజ్యసభ ఎంపీ

image

కాచిగూడలోని అభినందన్ గ్రాండ్‌లో శుక్రవారం బీసీ మేధావుల సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. మండలి ప్రతిపక్షనేత సీ.మధుసూదనాచారి, ఆల్ ఇండియా ఓబీసీ జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామి, బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, అఖిలపక్ష ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, కులసంఘాల సభ్యులు సదస్సులో పాల్గొన్నారు.

News January 17, 2025

HYD: చేవెళ్లలో త్వ‌ర‌లో ఉపఎన్నిక: కేటీఆర్

image

చేవెళ్ల నియోజ‌కవ‌ర్గంలో త్వ‌ర‌లోనే ఉప ఎన్నిక రాబోతుంద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మోసాల‌ను రైతులు, ఆడ‌బిడ్డ‌లు ఎండ‌గట్టాల‌ని కేటీఆర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో ఏర్పాటు చేసిన రైతు ధ‌ర్నాలో కేటీఆర్ పాల్గొని ప్ర‌సంగించారు. చేవెళ్లకు త్వ‌ర‌లో ఉప ఎన్నిక రాబోతోందని KTR వ్యాఖ్యలపై మీరేమంటారు. కామెంట్ చేయండి.