News October 20, 2024

HYD: GREAT..10 ఏళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి

image

HYD పంజాగుట్ట NIMSలో పదేళ్లలో వెయ్యి మందికి కిడ్నీల మార్పిడి చేసి అరుదైన ఘనత సాధించింది. 2014 నుంచి 2024 వరకు ఈ ఘనత సాధించినట్లు అధికారులు తెలిపారు.1989లో ఆసుపత్రిలో కిడ్నీల మార్పిడి ప్రారంభించగా..అప్పటి నుంచి 2014 వరకు 730 మందికి కిడ్నీల మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. జీవన్ దాన్ కేడవర్ ట్రాన్ ప్లాంటేషన్ కార్యక్రమం ప్రవేశపెట్టడంతో కిడ్నీల మార్పిడి ఆపరేషన్ల వేగం గణనీయంగా పెరిగింది.

Similar News

News October 26, 2025

రంగారెడ్డి: రేపు ‘లక్కీ’గా వైన్స్ దక్కేదెవరికి?

image

మద్యం షాపుల టెండర్లకు TG ఎక్సైజ్ శాఖ అధికారులు రేపు లక్కీ డ్రా తీయనున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌ యూనిట్‌లో 138 లిక్కర్ షాపులకు 7,761 దరఖాస్తులు వచ్చాయి. శంషాబాద్‌లో 111 షాపులకు 8,306 మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వానికి జిల్లా నుంచి రూ.482.01 కోట్ల ఆదాయం సమకూరింది. గ్రేటర్‌ పరిధిలోని 639 షాపులకు 34,958 దరఖాస్తులు రాగా.. రూ.1048.74 కోట్ల ఆదాయం రావడం విశేషం.

News October 21, 2025

ఈనెల 25తో ముగియనున్న సర్వే: రంగారెడ్డి కలెక్టర్

image

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ రూపకల్పన కోసం ఉద్దేశించిన “తెలంగాణ రైజింగ్ – 2047” సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని RR జిల్లా కలెక్టర్ C.నారాయణ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేశారన్నారు. దేశ స్వాతంత్య్రానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజలు సలహాలు ఇవ్వాలన్నారు.

News October 21, 2025

HYD: సెల్యూట్.. వీరులారా మీకు వందనం!

image

తెలంగాణ పోలీస్ శాఖ ఉలిక్కిపడిన ఘటన ఇది. మావోలు ఏకంగా పోలీస్ స్టేషన్‌ను పేల్చేశారు. ఇది జరిగి 28 ఏళ్లు గుడుస్తున్నా నేటికి అమరులైన పోలీసులే యాదికొస్తుండ్రు. 1997లో యాచారం PSలో జమీల్ అహ్మద్, రాజేశ్వర్ రావు కానిస్టేబుళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు. పథకం ప్రకారం మావోలు స్టేషన్‌‌ను పేల్చివేయడంతో విధి నిర్వహణలోనే ప్రాణాలు విడిచారు. పోలీస్ సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసు అమరులకు నివాళి అర్పిద్దాం.