News August 17, 2024

HYD: HYDRA.. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది!

image

ప్రభుత్వ భూముల రక్షణ, విపత్తు నిర్వహణ కోసం అతిపెద్ద సంస్థగా ఏర్పడిన HYDRA అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో HYDRA కమిషనర్ రంగనాథ్ IPS నేతృత్వంలో కొనసాగుతోంది. ఇద్దరు ఎస్పీలు, పలు విభాగాల అధికారులతో కలిపి దాదాపు 3,000 మందితో సంస్థ మరింత బలపడనుంది. ఇప్పటికే HYDలో ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతున్నారు.

Similar News

News November 28, 2025

HYD: రాత్రికి రాత్రే ఊరు మారిపోదు బ్రో..

image

మా ఊరు గ్రేటర్‌లో విలీనమైంది. ఇక అభివృద్ధి పరుగులు పెడుతుందని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. ‘అనేక గ్రామ పంచాయితీలు, మున్సిపాలిటీలు విలీనం అవుతున్నా, ప్రక్రియ పూర్తికావడానికి చాలా సమయం పడుతుంది. ఆ తర్వాతే అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. రాత్రికి రాత్రే ఊరు దశ.. దిశ మారిపోదు. పస్తుతం ఉన్న మహానగరంలోనే సమస్యలున్నాయి. విలీనం తర్వాత కూడా ఉంటాయి’ అని శివారులో గుసగుసలు వినిపిస్తున్నాయి.

News November 28, 2025

HYD: విలీనానికి ముందు.. అసలు లెక్క తేలాలిగా?

image

జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీల విలీన ప్రక్రియ సంపూర్ణం కావాలంటే చాలా లెక్కలు తేలాల్సి ఉంది. ఆయా మున్సిపాలిటీల ఆస్తులు, అప్పులు, ఆదాయవ్యయాలు, కరెంటు, వాటర్ బిల్లులు, పెండింగ్ బిల్లులు, భూముల వివరాలు.. ఇలా ఒకటేమిటి అన్నీ తేలాలి. ముఖ్యంగా వివాద భూముల లెక్కలు తేలాలి. ఇక ఆస్తి పన్నులు ఎన్నున్నాయి. ఎంత రావాలి అనేది కూడా క్లియర్‌గా ఉండాలి. అంతేకాక ఉద్యోగుల వివరాలు.. ఇవన్నీ జీహెచ్ఎంసీకి సమర్పించాలి.

News November 28, 2025

OU: పూర్తిస్థాయి కమిటీని ఎప్పుడు నియమిస్తారో?

image

ఉస్మానియా యూనివర్సిటీ ప్రస్తుతం పూర్తిస్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ (ఈసీ) లేకపోవడంతో పాలన కుంటుపడుతోంది. దాదాపు ఏడాది కాలంగా ఓయూ ఈసీ కమిటీ ఖాళీలతో నడుస్తోంది. వర్సిటీలో ఏవైనా కీలక నిర్ణయాలు తీసుకోవాలంటే ఈసీనే కీలకం. అలాంటిది సర్కారు ఈ విషయం గురించి ఆలోచించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈసీలో 12 మందికి గానూ వీసీ ప్రొ.కుమార్, డా.యోగితా రాణా, శ్రీదేవసేన, సందీప్ కుమార్ సుల్తానియా ఉన్నారు.