News August 17, 2024

HYD: HYDRA.. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది!

image

ప్రభుత్వ భూముల రక్షణ, విపత్తు నిర్వహణ కోసం అతిపెద్ద సంస్థగా ఏర్పడిన HYDRA అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పర్యవేక్షణలో HYDRA కమిషనర్ రంగనాథ్ IPS నేతృత్వంలో కొనసాగుతోంది. ఇద్దరు ఎస్పీలు, పలు విభాగాల అధికారులతో కలిపి దాదాపు 3,000 మందితో సంస్థ మరింత బలపడనుంది. ఇప్పటికే HYDలో ఆక్రమణలపై ఉక్కు పాదం మోపుతున్నారు.

Similar News

News October 14, 2025

విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షలు వాయిదా

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని విదేశీ భాషల డిప్లొమా కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. జూనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, జూనియర్ డిప్లొమా ఇన్ జర్మన్, సీనియర్ డిప్లొమా ఇన్ ఫ్రెంచ్, సీనియర్ డిప్లొమా ఇన్ జర్మన్ కోర్సుల పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ప్రకటించినప్పటికీ వాటిని వాయిదా వేసినట్లు చెప్పారు. ఈ పరీక్షలను తిరిగి వచ్చే నెల 4 నుంచి నిర్వహిస్తామన్నారు.

News October 14, 2025

హైదరాబాద్‌లో భారీగా ఇంజీనీర్లు బదిలీ

image

నీటిపారుదల శాఖలో భారీగా ఇంజినీర్ల బదిలీలు జరిగాయి. మొత్తం 106 మంది అధికారులను బదిలీ చేస్తూ ఇరిగేషన్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో ఒక్క హైదరాబాద్ సర్కిల్‌లో 60 మందికి పైగా బదిలీ అయ్యారు. ఒక్కసారి 106 మంది అధికారులు బదిలీ కావడంతో ఇరిగేషన్ శాఖలో చర్చకు దారి తీసింది. చాలా ఏళ్లుగా అధికారులు ఒకే స్థానంలో ఉండటంతో ప్రభుత్వం ప్రస్తుతం బదిలీ చేసినట్లు సమాచారం.

News October 14, 2025

జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం పోటీపై ఒవైసీ కీలక ప్రకటన

image

​జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు MIM అభ్యర్థిపై ఒకటి, రెండురోజుల్లో నిర్ణయం ప్రకటిస్తామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. పదేళ్ల BRS పాలనలో జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి లేదన్న ఆయన.. BRS నుంచి ఇక్కడ మంత్రి ఉన్నప్పటికీ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకపోయారన్నారు. బీజేపీకి పాజిటివ్‌గా ఉండటానికి తాను అభ్యర్థిని నిలబెడతాననే విమర్శలు వస్తాయన్న ఆయన.. కాంగ్రెస్‌కు తాము ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు.