News October 17, 2025
HYD: IPS బ్యాచ్ పాసింగ్ పరేడ్కు BSF DG

HYDలోని SVP నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ RR IPS బ్యాచ్ శిక్షణ పూర్తైంది. మొత్తం 190 మంది IPSలు, అందులో 65మంది మహిళలు (36%) ఉన్నారు. 50% మంది ఇంజినీరింగ్ నేపథ్యంతో అభ్యర్థులు ఉన్నారు. పరేడ్కు BSF DG దల్జిత్ సింగ్ చౌదరి ముఖ్య అతిథిగా హాజరై, ప్రతిభావంతులైన ట్రైనీలకు అవార్డులు అందజేయానున్నారు. 49 వారాల పాటు కఠిన శిక్షణ పూర్తిచేసిన అధికారులు త్వరలో బాధ్యతలు చేపడతారు.
Similar News
News October 18, 2025
ఓయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేడు(శనివారం) జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశామని ఓయూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించాలని సూచించారు.
News October 18, 2025
ఓయూ పరిధిలో నేటి పరీక్షలు వాయిదా

HYD ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నేడు(శనివారం) జరగాల్సిన పరీక్షలన్నీ వాయిదా వేశామని ఓయూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బీసీ సంఘాలు తలపెట్టిన తెలంగాణ బంద్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తామనేది తర్వాత ప్రకటిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని విద్యార్థులందరూ గమనించాలని సూచించారు.
News October 18, 2025
అంబాజీపేట: హోటల్లో టిఫిన్ తిని అస్వస్థతకు గురైన కూలీలు

అంబాజీపేటలోని ఒక హోటల్ లో టిఫిన్లు తిన్న కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వారిలో మాచవరానికి చెందిన 12 మంది శుక్రవారం అంబాజీపేట ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బెల్లం తయారీ కేంద్రంలో వెలువడిన వాయువు వల్లే ఇలా జరిగిందని మరో ప్రచారం జరుగుతోంది. దీనిపై విచారణ చేపట్టారు. పి.గన్నవరం సీఐ భీమరాజు, ఎస్ఐలు చిరంజీవి, శివకృష్ణ దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల నుంచి వివరాలు సేకరించారు.