News January 5, 2025
HYD: KBR పార్క్ ఎంట్రీ ఫీజు పెంపు

బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ ఎంట్రీ ఫీజును పెంచుతూ అటవీశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కేబీఆర్ పార్క్ వార్షిక ఎంట్రీ పాస్ జనరల్ కేటగిరికి గతంలో రూ.3,100 ఉండగా రూ.3,500, సీనియర్ సిటిజన్స్కు రూ.2,100 ఉండగా రూ.2,500లకు పెంచారు. తమ పాసులను 31 తర్వాత www.kbrnp.inలో రెన్యువల్ చేసుకోవాలని, పాఠశాల వార్షిక ఎంట్రీ పాసులను కూడా ఆన్లైన్లో రెన్యువల్ చేసుకోవాలని సూచించారు.
Similar News
News October 23, 2025
HYD: బుల్లెట్ తీసిన డాక్టర్లు.. అబ్జర్వేషన్లో సోను

పోచారం కాల్పుల ఘటనలో గాయపడ్డ సోనుకు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఆపరేషన్ ముగిసింది. 6 గంటల పాటు శ్రమించిన వైద్యులు శరీరం నుంచి బుల్లెట్ను బయటకు తీశారు. 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉంచారు. ఇది పూర్తయిన తర్వాత సోనుకు మరో సర్జరీ అవసరం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. <<18075641>>సోను<<>> మీద జరిగిన దాడిని బీజేపీ నేతలు సీరియస్గా తీసుకున్నారు. నిందితుడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్లో ప్రచారం.. ప్రతి పైసా లెక్క చెప్పాలి!

జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అభ్యర్థులు ప్రచారం కోసం చేసే ప్రతి పైసాను లెక్కించి అభ్యర్థుల ఖాతాలో జమ చేయాలని వ్యయ పరిశీలకులు సంజీవ్ కుమార్ లాల్ అధికారులకు సూచించారు. బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీఎంసీ, ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ రూమ్లను తనిఖీ చేశారు. అభ్యర్థుల పెయిడ్ న్యూస్పై నిఘా ఉంచాలన్నారు. ర్యాలీలు, సభలు, రోడ్ షోలను రికార్డింగ్ చేయాలన్నారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: 36 మంది నామినేషన్లు రిజెక్ట్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో నామినేషన్ల స్క్రూటీని కొనసాగుతోంది. నిన్న రాత్రి 7 గంటల వరకు 36 మంది అభ్యర్థుల 69 సెట్ల నామినేషన్లు తిరస్కరించారు. 45 మంది నామినేషన్లు ఆమోదించారు. నేడు ఉదయం నుంచి కూడా స్క్రూటినీ జరగనుంది. రేపు నామినేషన్ల ఉపసంహరణకు అధికారులు అవకాశం కల్పించారు. INC, BRS, BJP అభ్యర్థుల నామినేషన్లకు రిటర్నింగ్ ఆఫీసర్ ఆమోదం తెలిపారు.