News March 29, 2024
HYD: KCRలానే రేవంత్రెడ్డికి కళ్లు నెత్తికెక్కాయి: ఈటల
మాజీ సీఎం KCRకు కళ్లు నెత్తికెక్కడానికి ఐదేళ్లు పడితే.. ఆయన లానే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మూడు నెలల్లోపే కళ్లు నెత్తికెక్కాయి’ అని బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శలు చేశారు. గురువారం HYD రామంతాపూర్లో ఆయన మాట్లాడుతూ.. ఒక్కసారి ఓడిపోగానే BRS పరిస్థితి పూర్తిగా దిగజారిందన్నారు. 6 నెలల తర్వాత ఆరు గ్యారంటీల విషయమై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తానన్నారు.
Similar News
News January 17, 2025
ఇబ్రహీంపట్నం: కూతురు వరసయ్యే బాలికపై అత్యాచారం
కూతురు వరసైన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆదిభట్ల PS పరిధిలో జరిగింది. పోలీసుల కథనం.. తుర్కయంజాల్కు చెందిన ఆంజనేయులుకు వరుసకు కూతురయ్యే బాలిక పుట్టినరోజు సందర్భంగా కొత్త బట్టలు కొనిస్తానని ఇంట్లో చెప్పి తుర్కయంజాల్లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అనంతరం బాలిక కేకలు వేస్తూ బయటకు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశారు.
News January 17, 2025
HYD: జంట హత్యల కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు
నార్సింగి PSలో <<15169186>>జంట హత్య<<>>కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం.. సాకేత్కు బిందుతో పరిచయం ఏర్పడింది. అనంతరం సాకేత్ సాయంతో బిందు వ్యభిచారం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అంకిత్ స్నేహితుడు రాహుల్ బిందుతో ఏకాంతంగా గడిపి వీడియో తీసేందుకు యత్నించాడు. ఆమె అడ్డు చెప్పి అక్కడి నుంచి వచ్చి సాకేత్కు చెప్పడంతో రాహుల్ను హెచ్చరించాడు. దీంతో రాహుల్ కక్ష పెంచుకుని మరో ఇద్దరితో కలిసి హతమార్చాడు.
News January 17, 2025
నేడు గుడిమల్కాపూర్ మర్కెట్ కమిటీ ప్రమాణం
గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈరోజు జరుగనుంది. ఛైర్మన్గా మల్లేశ్, వైస్ ఛైర్మన్ చంద్రశేఖర్ సభ్యులు ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర టీపీసీసీ చీఫ్ మహేశ్గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, తుమ్మల నాగేశ్వర్రావు తదితరులు హాజరుకానున్నారు.