News November 13, 2024
HYD: KCR పాలనలో అవినీతిపై విచారణ జరిపించాలి: TRS

మాజీ సీఎం KCR పాలనలో జరిగిన అవినీతిపై ప్రభుత్వం CBIతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సమితి(TRS) చీఫ్ నరాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. HYD బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్, కరెంట్ అగ్రిమెంట్, ల్యాండ్ ట్రాన్సఫర్మేషన్లో KCR రూ.వేల కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. KCR అవినీతి తెలియజేసేందుకు DEC 6 నుంచి భద్రాచలం-చిలుకూరు బాలాజీ టెంపుల్కు పాదయాత్ర చేస్తామన్నారు.
Similar News
News October 28, 2025
క్యాబిన్ క్రూ జాహ్నవి గుప్తా ఆత్మహత్య

రాజేంద్రనగర్ పరిధిలో ఇండిగో ఎయిర్లైన్స్లో క్యాబిన్ క్రూగా పనిచేస్తున్న జాహ్నవి గుప్తా ఆత్మహత్య చేసుకుంది. జమ్మూకు చెందిన జాహ్నవి, ఇటీవల ఇండిగో క్యాప్టెన్, స్నేహితుడితో కలిసి పార్టీకి హాజరై, అనంతరం తన గదిలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. కొన్ని రోజులుగా ఆమె డిప్రెషన్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, ఆత్మహత్యకు గల కారణాలను మాత్రం తల్లిదండ్రులు పోలీసులకు వెల్లడించడం లేదు.
News October 28, 2025
HYD: ఓపెన్ యూనివర్సిటీలో నవంబర్ 13 వరకు అవకాశం

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2019-24 డిగ్రీ(BA/B.COM/BSC) విద్యార్థులకు ట్యూషన్ ఫీజు చెల్లించేందుకు NOV 13 వరకు అవకాశం ఉందని విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డా.Y.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. 2022-2024లో PG (MA/ M.COM/ MSC) అడ్మిషన్ పొందిన విద్యార్థులు కూడా ద్వితీయ సంవత్సరం ట్యూషన్ ఫీజు చెల్లించాలన్నారు. రిజిస్ట్రేషన్ కోసం www.braouonline.inను సందర్శించాలని ఆయన సూచించారు.
News October 28, 2025
HYDలోనూ పెరుగుతున్న లగ్జరీ హౌసెస్!

భారతదేశంలోని విలాసవంతమైన నగరాల్లో లగ్జరీ గృహాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పూణే తర్వాత HYD, చెన్నై, కోల్కత్తా వంటి 7 ప్రధాన నగరాల్లో 2025 జనవరి నుంచి జూన్ వరకు సుమారు 55,640 లగ్జరీ గృహాలు విక్రయమైనట్లు ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ గుణాంకాలు తెలిపాయి. మౌలిక సదుపాయాలు, జీవన ప్రమాణాలు మెరుగవడం ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు.


