News February 6, 2025

HYD: KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)

image

GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి‌ BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా చేయాలా..? వద్ద..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్‌‌లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.

Similar News

News December 1, 2025

భార్యను చంపి సెల్ఫీ.. వాట్సాప్‌లో స్టేటస్

image

భార్యను చంపి డెడ్ బాడీతో సెల్ఫీ తీసుకున్నాడో భర్త. కోయంబత్తూరు(TN)లో నివసించే బాలమురుగన్, శ్రీప్రియ(30)కు ముగ్గురు సంతానం. అయితే శ్రీప్రియ కొన్నాళ్లుగా హాస్టల్‌లో ఉంటూ జాబ్ చేస్తోంది. భార్య ఇంకొకరితో రిలేషన్‌లో ఉందని బాలమురుగన్ అనుమానం పెంచుకున్నాడు. హాస్టల్‌కు వెళ్లి కొడవలితో దాడి చేసి చంపాడు. బాడీతో సెల్ఫీ తీసుకుని వాట్సాప్ స్టేటస్‌ పెట్టుకున్నాడు. ‘ద్రోహానికి ఫలితం మరణం’ అని రాసుకొచ్చాడు.

News December 1, 2025

విశాఖ సమస్యలపై పార్లమెంట్‌లో గళం విప్పుతారా?

image

నేటి నుంచి పార్లమెంట్‌లో శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఉమ్మడి విశాఖ నుంచి ముగ్గురు MPలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జిల్లాలో ప్రధాన సమస్యలైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అపోహలు తొగించేలా ప్రకటన, రైల్వే జోన్‌కు గెజిట్ నోటిఫికేషన్, రాజమహేంద్రవరం-అనకాపల్లి నేషనల్ హైవేకి నిధులు, అనకాపల్లిలోని పలు స్టేషన్‌లలో రైళ్లకు హాల్ట్, గిరిజనుల హక్కుల పరిరక్షణపై గళం విప్పాలని ప్రజలు కోరుతున్నారు.

News December 1, 2025

ఖమ్మం: ఒకే ఊరు.. రెండు పంచాయతీలు

image

కూసుమంచి మండలం ఈశ్వరమాధారం పెద్ద గ్రామ పంచాయతీని గత ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం మూడు కొత్త పంచాయతీలుగా (ఈశ్వరమాధారం, మంగలితండా, రాజుపేట బజారు) విడదీసింది. అయితే, ఈ విభజనలో ఊరి మధ్యలో ఉన్న సీసీ రోడ్డునే సరిహద్దుగా నిర్ణయించారు. దీని కారణంగా ఇళ్లు పక్కపక్కనే ఉన్నా, నివాసితులు రెండు వేర్వేరు గ్రామ పంచాయతీల పరిధిలోకి వస్తున్నారు. ఈ అస్తవ్యస్త విభజన వల్ల ప్రజలకు పరిపాలనా సమస్యలు తలెత్తుతున్నాయి.