News February 6, 2025
HYD: KCR రాజీనామా చేయాలా.. వద్దా..?: (VIRAL)

GHMC కార్పొరేటర్ ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సరూర్నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి BRS తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూ.. ‘అసెంబ్లీకి రాని, ప్రజల సమస్యలు పట్టించుకోని KCR గారు గజ్వేల్ MLAగా రాజీనామా చేయాలా..? వద్ద..?’ అని ప్రశ్నించారు. దీనిపై ఇరు పార్టీల సోషల్ యాక్టివిస్ట్లు స్పందించారు. నిజమే అని BJP శ్రేణులు.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఏంటని BRS నేతలు పోటీ పడటం గమనార్హం.
Similar News
News December 15, 2025
ఉద్యోగి రాజీనామా చేస్తే పెన్షన్కు అనర్హుడు: SC

ఉద్యోగి రాజీనామా చేస్తే అతని గత సర్వీసు రద్దవుతుందని, అలాంటి వారు ఫ్యామిలీ పెన్షన్కు అనర్హులని SC పేర్కొంది. ఉద్యోగి చేసిన రాజీనామాను ఆమోదించిన DTC PF మాత్రమే వస్తుందని, పెన్షన్ రాదని చెప్పింది. దీనిపై అతడు దావా వేయగా SC తాజా తీర్పు ఇచ్చింది. ‘VRకి పెన్షన్ వర్తిస్తుందన్నరూల్ ఉన్నా దానికి రిజైన్కీ తేడా ఉంది. రిజైన్తో పెన్షన్ రాదు’ అని పేర్కొంది. ఉద్యోగులకు ఈ తీర్పొక హెచ్చరికగా పలువురి సూచన.
News December 15, 2025
SRCL: భూ భారతి అమలుపై ఇన్చార్జి కలెక్టర్ సమీక్ష

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ భారతి అమలుపై ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సమీక్ష నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఆమె అదనపు కలెక్టర్ గడ్డం నగేష్తో కలిసి సమావేశమయ్యారు. భూ భారతి, సాదా బైనమా, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల స్థితిగతులు, ప్రభుత్వ, అసైన్డ్ భూముల వివరాలపై ఆరా తీశారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
News December 15, 2025
బాణాసంచా కేంద్రాల్లో భద్రత తప్పనిసరి: జేసీ

బాణసంచా తయారీ, నిల్వ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. నిల్వ కేంద్రాల్లో సల్ఫర్, అమోనియా వంటి రసాయనాలు ఒక్కోటి 50 కేజీలకు మించి ఉండరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.


