News April 5, 2024

HYD: KCR అలా.. రేవంత్‌రెడ్డి ఇలా: రాగిడి లక్ష్మారెడ్డి

image

BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. రైతుల కష్టాలను తెలుసుకోవడం కోసం మాజీ సీఎం KCR పొలం బాట పడితే.. రాష్ట్రాన్ని పాలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియానికి వెళ్లారన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను పట్టించుకోవడానికి సమయం లేని సీఎంకు, IPL చూసేందుకు ఎలా టైం దొరికిందని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.

Similar News

News November 3, 2025

BREAKING: HYD: బాలానగర్‌లో MURDER

image

HYD బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణ హత్య జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఐడీపీఎల్ బస్టాప్ సమీపంలో గఫర్(39) అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడి రక్తస్రావం కారణంగా గఫర్ ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

News November 3, 2025

జూబ్లీహిల్స్‌లో గెలుపు మాదే: కిషన్ రెడ్డి

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ ప్రచారం ఊపందుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అభ్యర్థి దీపక్ రెడ్డితో కలిసి బైక్ ర్యాలీ, క్యాంపెయిన్ నిర్వహించారు. నాగార్జున కమ్యూనిటీ హాల్ నుంచి ర్యాలీ ప్రారంభమైంది. జూబ్లీహిల్స్‌లో బీజేపీ గెలుపు పక్కా అని, BRS, కాంగ్రెస్ పాలనల్లో వెనుకబాటును సరిదిద్దేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఉపఎన్నికలో దీపక్ రెడ్డి విజయం కీలకమని పేర్కొన్నారు.

News November 3, 2025

VKB: తండ్రికి టాటా చెప్పి.. మృత్యువు ఒడికి

image

చేవెళ్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తాండూరు మండలంలోని ఓ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. గౌతాపూర్ గ్రామానికి చెందిన చాంద్ పాషా కూతురు ముస్కాన్ (21) హైదరాబాద్ కోఠి ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ చదువుతోంది. ఆదివారం సెలవులో ఇంటికి వచ్చిన ఆమె, సోమవారం ఉదయం తాండూరు ఆర్టీసీ బస్సులో హైదరాబాద్‌కు బయల్దేరింది. బస్సు ఎక్కించే తండ్రికి “టాటా” చెప్పి వెళ్లిన ముస్కాన్ ప్రమాదంలో దుర్మరణం చెందింది.