News July 4, 2024

HYD: KCR, KTR రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారు: ఎంపీ

image

కాళేశ్వరం పేరిట మాజీ సీఎం KCR, మాజీ మంత్రి KTR తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. KCR కుటుంబ పాలనలో అనేక స్కాములు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని NDA ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News November 16, 2025

బలమైన లీడర్ వస్తే.. నేను రెస్ట్ తీసుకుంటా: అక్బరుద్దీన్

image

‘ప్రజాభిమానంతో నేను ఆరు పర్యాయాలు శాసనసభ్యుడిగా సేవచేశా.. ఇంతకంటే ఇంకేం కావాలి జీవితానికి.. ఈ క్రమంలో బాగా అలసిపోయా..రెస్ట్ తీసుకుంటా..’ అని చాంద్రాయణగుట్ట MLA అక్బరుద్దీన్ మనసులోమాట వెల్లడించారు. ఓల్డ్ సిటీలో జరిగిన ఓకార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘పిల్లల అభివృద్ధి కోసం విద్యా సంస్థలను ఏర్పాటు చేశాను.. నా స్థానంలోకి ఎవరైనా బలమైన నాయకుడు వస్తే నేను తప్పుకొని ప్రశాంత జీవనం గడుపుతా’ అని పేర్కొన్నారు.

News November 16, 2025

ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు RTA స్ట్రాంగ్ వార్నింగ్

image

చేవెళ్ల బస్సు ప్రమాదం తరువాత RTA అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ ప్రైవేటు వాహనాలను తనిఖీ చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేశ్ ప్రైవేటు బస్సు ఆపరేటర్లకు వార్నింగ్ ఇచ్చారు. ప్రయాణికుల లగేజీ కాకుండా ఇతర లగేజీ తీసుకువెళితే చర్యలు తీసుకుంటామన్నారు. 30 ప్రాంతాల్లో 24 గంటలపాటు  ప్రత్యేక సిబ్బంది బస్సులను తనిఖీ చేస్తున్నారన్నారు.

News November 16, 2025

HYD: బిర్సా ముండా జయంతి సందర్భంగా ర్యాలీ

image

భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సావిత్రితో కలిసి ట్యాంక్ బండ్ వద్ద స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వివేకానంద విగ్రహం నుంచి కొమురం భీమ్ విగ్రహం వరకు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదివాసీల హక్కుల కోసం భగవాన్ బిర్సా ముండా చూపిన ధైర్యం ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల్గొన్నారు.