News July 4, 2024

HYD: KCR, KTR రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారు: ఎంపీ

image

కాళేశ్వరం పేరిట మాజీ సీఎం KCR, మాజీ మంత్రి KTR తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆరోపించారు. HYDలో ఆయన మాట్లాడుతూ.. KCR కుటుంబ పాలనలో అనేక స్కాములు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని NDA ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై మీ కామెంట్?

Similar News

News October 13, 2025

HYD: ఒకే ఇంట్లో 43 ఓట్లు.. విచారణకు ఆదేశం

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటర్ జాబితాపై అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఓట్ చోరీ అంటూ వచ్చిన ఆరోపణలపై ఎన్నికల అధికారి విచారణకు ఆదేశించారు. యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణానగర్‌లోని 8-3-231/బీ/160 ఇంట్లో ఇటీవల 43 ఓట్లు నమోదయ్యాయి. దీనిని సుమోటోగా స్వీకరించిన జూబ్లీహిల్స్ ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ విచారణకు ఆదేశించారు.

News October 13, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌లో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు

image

HYD జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్ విడుదలైంది. ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పెసరకాయ పరీక్షిత్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయగా మరొక స్వతంత్ర అభ్యర్థిగా చాలోక చంద్రశేఖర్ ఒక సెట్ నామినేషన్‌ను దాఖలు చేశారు. ఈనెల 21 వరకు నామినేషన్ దాఖలకు సమయం ఉండగా 24 వరకు విత్ డ్రాకు అవకాశం ఉంది.

News October 13, 2025

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 300 నామినేషన్లు వేస్తాం: మందాల భాస్కర్

image

తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు ఈరోజు HYD సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. మాలలకు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణలో అన్యాయం జరిగిందని, దానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. మాలలకు జరిగిన అన్యాయానికి నిరసనగా రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 300 మంది మాలలు నామినేషన్లు వేస్తామని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మాదాల భాస్కర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.