News March 29, 2024
HYD: KTRపై కేసు నమోదు

BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై కేసు నమోదైంది. CM రేవంత్ రెడ్డిపై KTR అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతడిపై చర్యలు తీసుకోవాలని TPCC సభ్యుడు బత్తిని శ్రీనివాస్రావు, కాంగ్రెస్ నేతలు హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలను KTR తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. దీనిపై IPC సెక్షన్లు 504, 505 కింద జీరో FIR నమోదు చేసి కేసును HYD బంజారాహిల్స్ PSకు బదిలీ చేశామని అక్కడి ఇన్స్పెక్టర్ సతీశ్ తెలిపారు.
Similar News
News November 12, 2025
HYD: ఏడాదికి 20 వేలకు పైగా క్యాన్సర్ కేసులు..!

HYDలోని MNJ క్యాన్సర్ ఆసుపత్రికి ప్రతి సంవత్సరం సుమారు 20,000 మంది కొత్త క్యాన్సర్ బాధితులు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా రోగులు ఈ ప్రభుత్వ వైద్య కేంద్రానికి వస్తున్నారు. ఆసుపత్రిలో ఉచితంగా కీమోథెరపీ, రేడియేషన్, సర్జరీ సేవలు అందుబాటులో ఉన్నాయి. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక విభాగాలు, పాలియేటివ్ కేర్ యూనిట్లు కూడా ఉన్నాయి.
News November 12, 2025
జూబ్లీహిల్స్: సర్వేల్లో BRS.. ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్..!

జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలపై లోకల్ వాళ్లే కాదు తెలుగు రాష్ట్రాల వారు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కాగా ఎలక్షన్ ముందు దాదాపు అన్ని సర్వేలు BRS గెలుస్తుందని చెప్పగా ఎగ్జిట్ పోల్స్లో మాత్రం ఎక్కువ సర్వేలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పాయి. దీంతో థగ్ ఆఫ్ వార్ పోటీ ఉందంటూ ఇరు పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. NOV 14న వెలువడే ఫలితాల్లో గెలుపు మాదే అంటూ ఇరు పార్టీలు ధీమాగా ఉన్నాయి.
News November 12, 2025
HYD రానున్న.. ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ

ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ డిసెంబర్లో HYDకు రానున్నారు. CM రేవంత్ రెడ్డి రూపొందించిన ‘తెలంగాణ రైజింగ్ 2047’ ప్రణాళికకు మెస్సీని బ్రాండ్ అంబాసడర్గా నియమించే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ ప్రణాళిక ద్వారా తెలంగాణను 2033 నాటికి 1 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే లక్ష్యంగా ముందుకు సాగుతుంది.


