News October 25, 2024

HYDలో కనీస మౌలిక వసతులు లేవు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

image

TG: మూసీ సుందరీకరణ పేరుతో పేదలను ఇబ్బందులకు గురిచేస్తే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మూసీ పరీవాహకంలో ఇళ్లు కూల్చవద్దని చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. నగరంలో కనీస మౌలిక వసతులు లేవన్నారు. గత పాలకులు గులాబీ రంగుల్లో గ్రాఫిక్స్ చూపించారని విమర్శించారు. కేసీఆర్ మాదిరే రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.

Similar News

News December 4, 2025

ఇలా చేస్తే.. హ్యాకర్లకి చిక్కరు!

image

రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. హిస్టరీ డిలీట్ చేయడం, ప్రైవేట్ ట్యాబ్ ఉపయోగించడం నిజమైన రక్షణ కాదని నిపుణులు అంటున్నారు. పూర్తిస్థాయి ప్రైవసీ కోసం జీరో-లాగ్ VPN వాడటం వల్ల బ్రౌజ్‌ చేసేటప్పుడు హిస్టరీ సేవ్ అవ్వదు. బ్రౌజింగ్‌కి వేర్వేరు డివైజ్‌లు ఉపయోగించడం వల్ల డేటా ట్రేస్ చేయడం కష్టం అవుతుంది. కుకీలను బ్లాక్ చేయాలి. ప్రతీ దానికి ఒకే మెయిల్ వాడకూడదు. పాస్‌వర్డ్‌లను మారుస్తూ ఉండాలి.

News December 4, 2025

160 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (<>BHEL<<>>) 160 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ITI, డిప్లొమా, డిగ్రీ(BE, బీటెక్, BBA) అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి ఈ నెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 27ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. NATS పోర్టల్‌లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్‌సైట్: https://bpl.bhel.com/

News December 4, 2025

తెలంగాణలో అఖండ-2 టికెట్ రేట్ల పెంపు

image

‘అఖండ-2’ సినిమా టికెట్ రేట్ల <<18450771>>పెంపునకు<<>> TG ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రా.8 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవనున్నట్లు పేర్కొంది. ప్రీమియర్ షో టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ధారించింది. తర్వాతి 3 రోజులు సింగిల్ స్క్రీన్‌కు రూ.50, మల్టీప్లెక్స్‌లకు రూ.100 చొప్పున పెంచుకోవచ్చని తెలిపింది. టికెట్ రేట్ల పెంపుతో వచ్చే రెవెన్యూలో 20% మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఇవ్వాలని GOలో పేర్కొంది.