News October 16, 2024
HYD: LRS తర్వాత మూడు రెట్ల భారం!

HMDA పరిధిలో LRS కింద ఇప్పుడు క్రమబద్ధీకరించుకుంటే 2020 నాటి భూమి విలువ ప్రకారం ఛార్జీలు ఉంటాయి. ఆలస్యం చేస్తే మూడు రెట్ల భారం పడనుంది. నిర్మాణ అనుమతి తీసుకునే నాటి భూమి విలువతో 33 శాతం జరిమానా, 14 శాతం ఓపెన్ ప్లాట్ డెవలప్మెంట్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే LRS రుసుములు చెల్లించాలని సూచిస్తున్నారు.
SHARE IT
Similar News
News October 21, 2025
జూబ్లీ బైపోల్.. నేటితో నామినేషన్ల గడువు పూర్తి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 127 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇవాళ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు నామినేషన్లను పరిశీలించనున్నారు. 24న ఉపసంహరణకు తుది గడువు. నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.
News October 21, 2025
HYD: సదర్ ఉత్సవం.. దద్దరిల్లనున్న సిటీ

HYDలో యాదవులు నేడు సదర్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. దీపావళి తర్వాత జరిగే ఈ పండుగ కోసం ఖైరతాబాద్, బోయిన్పల్లి, మూసాపేట్ వంటి ప్రాంతాలు సిద్ధమయ్యాయి. హరియాణా నుంచి భారీ దున్నరాజులు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. యాదవ సోదరులు తమ దున్నరాజులతో డప్పులు, ఆటపాటల నడుమ ఊరేగింపుగా వచ్చి, ఒకచోట సదర్ను జరుపుకుంటారు.
News October 21, 2025
HYD: సదర్.. దున్నరాజుకు రూ.31 వేల మద్యం

ముషీరాబాద్లో సదర్ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో కేరళ నుంచి తెచ్చిన 2,500 కిలోల ‘దున్నరాజు’ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉత్సవంలో యాదవులు రూ.31,000 విలువైన ‘రాయల్ సెల్యూట్’ బాటిల్ను దున్నరాజుకు తాగించారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నగరంలో సదర్ ఉత్సవాలు మరింత ఉత్సాహంగా జరుగుతున్నాయి.