News March 16, 2024

HYD: శంభీపూర్ రాజుని కలిసిన మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి

image

ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజుని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శంభీపూర్ రాజు లక్ష్మారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మల్కాజిగిరి టికెట్‌ను తొలుత శంభీపూర్ రాజుకు ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి ఇద్దరి కలయికతో శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Similar News

News February 2, 2026

HYDలో మళ్లీ పెరిగిన ఎయిర్ పొల్యూషన్ @318

image

HYDలో ఎయిర్ క్వాలిటీలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సాధరణంగా పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల పొగతో కాలుష్యం పెరుగుతుంటుంది. డబుల్ డిజిట్‌లో ఉండే ఎయిర్‌ క్వాలిటీ సోమవారం తెల్లవారుజామున సోమాజిగూడలోని టీచర్స్ కాలనీలో 318గా రికార్డ్ అయ్యింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటిస్ ఉన్నవారితో పాటు ప్రజలు వీలైనంత వరకు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News February 2, 2026

HYD: భార్య ఆత్మహత్య బెదిరింపు.. స్టూల్‌ తన్నేసిన భర్త!

image

క్షణికావేశం, మద్యం మత్తు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఫిలింనగర్‌కు చెందిన కొండల్ శనివారం రాత్రి మద్యం తాగి వచ్చి భార్య అరుణతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తనను బెదిరించేందుకు అరుణ స్టూల్‌పై ఎక్కి ఉరి వేసుకోబోగా, ఆగ్రహంతో ఉన్న కొండల్ స్టూల్‌ను కాలితో తన్నేశాడు. దీంతో ఆమె ఊపిరాడక ప్రాణాలు విడిచింది. కుమారుడు ఇచ్చిన సాక్ష్యంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News February 2, 2026

HYD: వంటరితనమే ఆ కుటుంబాన్ని కబళించిందా..?

image

చర్లపల్లి వద్ద రైలుకింద పడి <<19011053>>తల్లి, పిల్లలు సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. భర్త సురేందర్‌ ఉద్యోగ రీత్యా దుబాయ్‌లో ఉండగా మృతురాలు విజయ IT కంపెనీలో టీమ్‌లీడర్‌. పిల్లలు హాస్టల్‌‌లో ఉంటున్నారు. ఒంటరితనం పీడిస్తోందని బందువులతో చెప్పి, సూసైడ్‌ నోట్‌‌ రాసి తన కారులో పెట్టి, వాట్సప్‌ స్టేటస్‌గా కూడా సూసైడ్ లెటర్ పెట్టినట్లు సమాచారం. సూసైడ్‌కు కారణం ఒంటరితనమా, మరేదైనా కారణమా అన్నది తెలియాల్సి ఉంది.